రామన్నపేట నుంచి భారీగా తరలిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం
రామన్నపేట నుంచి భారీగా తరలిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం
Editor Desk
రామన్నపేట మండలం నుంచి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు, కార్యకర్తలు తార్నాకలో నిర్వహించిన సమావేశానికి భారీగా తరలివెళ్లారు. ఈ కార్యక్రమం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మైనార్టీ సెల్ రాష్ట్ర కన్వీనర్ ఎస్కే చాంద్ ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సందర్భంగా ఎస్కే చాంద్ మాట్లాడుతూ ఉద్యమకారుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. ఆయన ప్రధానంగా ఈ క్రింది డిమాండ్లు వెల్లడించారు: ఉద్యమకారులకు 250 చదరపు గజాల స్థలం కేటాయించడం, నెలకు రూ.25 వేల పింఛన్ ఇవ్వడం, నిజమైన ఉద్యమకారులను గుర్తించి గుర్తింపు కార్డులు జారీ చేయడం, రూ.50 లక్షల వరకు వైద్య సదుపాయం కల్పించడం, ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను గుర్తించి ఆదుకోవడం, అలాగే ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఫోరం మండల అధ్యక్షులు నోముల శంకర్, ఉపాధ్యక్షులు బొడ్డుపల్లి లింగయ్య, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు ఎండి ఇమామ్ (బోగారం మాజీ ఉపసర్పంచ్), రాష్ట్ర నాయకులు గడ్డం యాదగిరి, ఉద్యమ నాయకులు మందడి రవీందర్ రెడ్డి, మాజీ మండల ఉపాధ్యక్షులు మద్దగల నరసింహ, కొండ మల్లేశం గౌడ్ , కైరం కొండ సంతోష్, వంగాల యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి