Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:25 PM

రామన్నపేట నుంచి భారీగా తరలిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం

రామన్నపేట నుంచి భారీగా తరలిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం

రామన్నపేట నుంచి భారీగా తరలిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం
18-04-2026 123 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలం నుంచి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు, కార్యకర్తలు తార్నాకలో నిర్వహించిన సమావేశానికి భారీగా తరలివెళ్లారు. ఈ కార్యక్రమం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మైనార్టీ సెల్ రాష్ట్ర కన్వీనర్ ఎస్కే చాంద్ ఆధ్వర్యంలో జరిగింది.

ఈ సందర్భంగా ఎస్కే చాంద్ మాట్లాడుతూ ఉద్యమకారుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. ఆయన ప్రధానంగా ఈ క్రింది డిమాండ్లు వెల్లడించారు: ఉద్యమకారులకు 250 చదరపు గజాల స్థలం కేటాయించడం, నెలకు రూ.25 వేల పింఛన్ ఇవ్వడం, నిజమైన ఉద్యమకారులను గుర్తించి గుర్తింపు కార్డులు జారీ చేయడం, రూ.50 లక్షల వరకు వైద్య సదుపాయం కల్పించడం, ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను గుర్తించి ఆదుకోవడం, అలాగే ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్‌కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఫోరం మండల అధ్యక్షులు నోముల శంకర్, ఉపాధ్యక్షులు బొడ్డుపల్లి లింగయ్య, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు ఎండి ఇమామ్ (బోగారం మాజీ ఉపసర్పంచ్), రాష్ట్ర నాయకులు గడ్డం యాదగిరి, ఉద్యమ నాయకులు మందడి రవీందర్ రెడ్డి, మాజీ మండల ఉపాధ్యక్షులు మద్దగల నరసింహ, కొండ మల్లేశం గౌడ్ , కైరం కొండ సంతోష్, వంగాల యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రామన్నపేట నుంచి భారీగా తరలిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం

Article Image

రామన్నపేట మండలం నుంచి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు, కార్యకర్తలు తార్నాకలో నిర్వహించిన సమావేశానికి భారీగా తరలివెళ్లారు. ఈ కార్యక్రమం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మైనార్టీ సెల్ రాష్ట్ర కన్వీనర్ ఎస్కే చాంద్ ఆధ్వర్యంలో జరిగింది.

ఈ సందర్భంగా ఎస్కే చాంద్ మాట్లాడుతూ ఉద్యమకారుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. ఆయన ప్రధానంగా ఈ క్రింది డిమాండ్లు వెల్లడించారు: ఉద్యమకారులకు 250 చదరపు గజాల స్థలం కేటాయించడం, నెలకు రూ.25 వేల పింఛన్ ఇవ్వడం, నిజమైన ఉద్యమకారులను గుర్తించి గుర్తింపు కార్డులు జారీ చేయడం, రూ.50 లక్షల వరకు వైద్య సదుపాయం కల్పించడం, ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను గుర్తించి ఆదుకోవడం, అలాగే ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్‌కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఫోరం మండల అధ్యక్షులు నోముల శంకర్, ఉపాధ్యక్షులు బొడ్డుపల్లి లింగయ్య, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు ఎండి ఇమామ్ (బోగారం మాజీ ఉపసర్పంచ్), రాష్ట్ర నాయకులు గడ్డం యాదగిరి, ఉద్యమ నాయకులు మందడి రవీందర్ రెడ్డి, మాజీ మండల ఉపాధ్యక్షులు మద్దగల నరసింహ, కొండ మల్లేశం గౌడ్ , కైరం కొండ సంతోష్, వంగాల యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News