Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ భూమిపై మట్టి మాఫియా… రైల్వే పనుల పేరిట అక్రమ తవ్వకాలు! కదం తొక్కిన గిల్.. కోల్‌కతాపై గుజరాత్‌ ఘన విజయం రైతు కుటుంబానికి అండగా రెడ్స్ సంస్థ ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 18, 2026 02:56 PM

రామన్నపేట నుంచి భారీగా తరలిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం

రామన్నపేట నుంచి భారీగా తరలిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం

రామన్నపేట నుంచి భారీగా తరలిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం
April 18, 2026 12:54 PM 49 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలం నుంచి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు, కార్యకర్తలు తార్నాకలో నిర్వహించిన సమావేశానికి భారీగా తరలివెళ్లారు. ఈ కార్యక్రమం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మైనార్టీ సెల్ రాష్ట్ర కన్వీనర్ ఎస్కే చాంద్ ఆధ్వర్యంలో జరిగింది.

ఈ సందర్భంగా ఎస్కే చాంద్ మాట్లాడుతూ ఉద్యమకారుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. ఆయన ప్రధానంగా ఈ క్రింది డిమాండ్లు వెల్లడించారు: ఉద్యమకారులకు 250 చదరపు గజాల స్థలం కేటాయించడం, నెలకు రూ.25 వేల పింఛన్ ఇవ్వడం, నిజమైన ఉద్యమకారులను గుర్తించి గుర్తింపు కార్డులు జారీ చేయడం, రూ.50 లక్షల వరకు వైద్య సదుపాయం కల్పించడం, ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను గుర్తించి ఆదుకోవడం, అలాగే ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్‌కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఫోరం మండల అధ్యక్షులు నోముల శంకర్, ఉపాధ్యక్షులు బొడ్డుపల్లి లింగయ్య, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు ఎండి ఇమామ్ (బోగారం మాజీ ఉపసర్పంచ్), రాష్ట్ర నాయకులు గడ్డం యాదగిరి, ఉద్యమ నాయకులు మందడి రవీందర్ రెడ్డి, మాజీ మండల ఉపాధ్యక్షులు మద్దగల నరసింహ, కొండ మల్లేశం గౌడ్ , కైరం కొండ సంతోష్, వంగాల యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News