Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రతి పిల్లవాడూ ప్రభుత్వ పాఠశాలలోనే చేరాలి: సర్పంచ్ రాధా శ్రీనివాస్ “500 గర్భిణులను బైక్‌లో రక్షించిన ప్రాణదాత: ఛత్తీస్‌గఢ్ ‘బైక్ హీరో’ సురేష్ బెల్సారే” “మండల మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో ఆర్టీసీకి అద్దె బస్సులు… మహిళల ఆర్థిక సాధికారతకు కొత్త దిశ : సి‌ఎం రేవంత్” చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 03, 2026 05:53 PM

రామన్నపేట నియోజకవర్గ సాధనకు వాల్ పోస్టర్ ఆవిష్కరణ

రామన్నపేట నియోజకవర్గ సాధనకు వాల్ పోస్టర్ ఆవిష్కరణ

రామన్నపేట నియోజకవర్గ సాధనకు వాల్ పోస్టర్ ఆవిష్కరణ
April 03, 2026 04:11 PM 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి ఆధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రంలోని సుభాష్ సెంటర్ వద్ద నియోజకవర్గ సాధనకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు బొడ్డుపల్లి లింగయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర రమేష్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రామన్నపేటను ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలనే ఆకాంక్ష ప్రజల్లో, ప్రజాప్రతినిధుల్లో విస్తృతంగా ఉందన్నారు. వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరై మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

కొంతమంది నాయకులు వ్యక్తిగత కారణాలతో హాజరుకాలేకపోయినా, వారి మద్దతు ఉందని పేర్కొన్నారు. నియోజకవర్గ సాధన కోసం ఒక ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని, అన్ని పార్టీలతో కలసి ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని తెలిపారు.

త్వరలోనే ఎంపీలు, కేంద్ర మంత్రులను కలుసుకోవడం, ప్రజాక్షేత్రంలో నిరాహార దీక్షలు, ర్యాలీలు వంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నామని చెప్పారు. సామాజిక మాధ్యమాలు సహా అన్ని మార్గాల్లో ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పోచబోయిన మల్లేశం, పోతరాజు శంకరయ్య, వర్కాల గోపాల్, నకరికంటి అశోక్, సాల్వేరు అశోక్, ఎస్‌కే చాంద్, గడ్డం యాదగిరి, ఎండి ఫజల్, కూనూరు కృష్ణ, జెట్టి శివప్రసాద్, గొలుసుల ప్రసాద్, గంగాపురం యాదయ్య, కూనూరు శ్రీనివాస్, పున్న వెంకటేశం, సంగిశెట్టి సుదర్శన్, రేఖ యాదయ్య, రచ్చ యాదగిరి, దండుగుల రాములు, నకిరెకంటి నరేష్, నకిరెకంటి నరేందర్, బాలగోని గణేష్, ఎర్ర బిక్షపతి, బాలగోని మల్లయ్య, ఎర్ర నర్సయ్య, పెండెం రవీందర్, రామోజీ నరసింహాచారి, కోట సుధాకర్, ఇమామ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News