Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 01:19 AM

రామన్నపేట మార్కెట్‌లో నకిలీ సిగరెట్ల హవా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం – అధికారులు మౌనం!

రామన్నపేట మార్కెట్‌లో నకిలీ సిగరెట్ల హవా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం – అధికారులు మౌనం!

రామన్నపేట మార్కెట్‌లో నకిలీ సిగరెట్ల హవా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం – అధికారులు మౌనం!
April 01, 2026 11:51 AM 146 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలో నకిలీ సిగరెట్ల దందా రోజురోజుకు పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. అనుమతి లేకుండా, నాణ్యతలేని సిగరెట్లను కొన్ని అసాంఘిక శక్తులు అసలు బ్రాండ్ల పేర్లతో మార్కెట్లోకి తెచ్చి విక్రయిస్తున్నట్లు సమాచారం. వీటి ద్వారా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న పరిస్థితి నెలకొంది.

మార్కెట్లో చలామణి అవుతున్న ఈ నకిలీ సిగరెట్లలో ఉపయోగించే పొగాకు, రసాయనాలు ప్రమాదకరమైనవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవి వినియోగించడం వల్ల ఊపిరితిత్తులు సహా శరీరంలోని ఇతర అవయవాలకు తీవ్రమైన హాని కలిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

తక్కువ ధరకు లభిస్తున్న ఈ నకిలీ ఉత్పత్తులవైపు ముఖ్యంగా యువత ఆకర్షితులవుతున్నారు. అసలు-నకిలీ తేడా తెలియకుండానే కొనుగోలు చేస్తూ అనారోగ్య సమస్యలను ఆహ్వానించుకుంటున్నారు. ఇప్పటికే సిగరెట్ వినియోగమే ఆరోగ్యానికి హానికరం కాగా, నకిలీ ఉత్పత్తులు మరింత ప్రమాదాన్ని కలిగిస్తున్నాయి.

ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. మార్కెట్లో బహిరంగంగానే విక్రయాలు కొనసాగుతున్నప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఇలాంటి అక్రమ వ్యాపారాలను అరికట్టేందుకు తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మండలంలోని కిరాణా దుకాణాలు, ఇతర విక్రయ కేంద్రాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి నకిలీ సిగరెట్ల విక్రయాలను పూర్తిగా నిలిపివేయాలని, అలాగే నకిలీ నిత్యావసర వస్తువులపై కూడా దృష్టి సారించి చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News