Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎక్సైజ్ కమిషనర్ ను తక్షణమే సస్పెండ్ చేయాలి.... వాట్సాప్‌లో భూ నమోదు సేవలు ప్రారంభం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 13, 2026 08:09 AM

రామలింగేశ్వరుని సన్నిధిలో సర్పంచ్ దంపతుల ప్రత్యేక పూజలు

రామలింగేశ్వరుని సన్నిధిలో సర్పంచ్ దంపతుల ప్రత్యేక పూజలు

రామలింగేశ్వరుని సన్నిధిలో సర్పంచ్ దంపతుల ప్రత్యేక పూజలు
January 18, 2026 08:23 PM 134 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అమావాస్య వేళ గుట్టపై రామలింగేశ్వరునికి మహాపూజలు.. భక్తులతో కిటకిటలాడిన ఆలయం

చిట్యాల స్థానికం ప్రతినిధి రిపోర్టర్ ప్రశాంత్

చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామ శివారులోని గుట్టపై శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం ఆదివారం అమావాస్య సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. గ్రామ సర్పంచ్ బత్తుల లక్ష్మీప్రసన్న నర్సింహ గౌడ్ దంపతులు స్వామివారికి అభిషేకాలు, గోత్రనామార్చనలు, ప్రత్యేక పూజలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.వేదమంత్రోచ్చారణల మధ్య అర్చకులు పూజలు కొనసాగించగా, భక్తులకు తీర్థప్రసాదాలు అందించి స్వామివారి ఆశీర్వచనాలు ప్రసాదించారు. అనంతరం కీ.శే. బత్తుల సాలయ్య గౌడ్–సత్తమ్మ దంపతుల పవిత్ర స్మృతికి గుర్తుగా వారి కుమారుడు, కోడలు అయిన సర్పంచ్ దంపతులు గుట్టపై భక్తులకు విస్తృతంగా అన్నదానం ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలిచారు.

ఈ సందర్భంగా సర్పంచ్ బత్తుల లక్ష్మీప్రసన్న నర్సింహ గౌడ్ మాట్లాడుతూ శ్రీ రామలింగేశ్వర స్వామి అనంత కృపతో గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని హృదయపూర్వకంగా ఆకాంక్షించారు.ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో దేవస్థానం కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామస్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనంతో పునీతులయ్యారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News