Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
క్రమశిక్షణ,ఆత్మవిశ్వాసానికి కరాటే ఉత్తమ మార్గం:ఎస్ఐ క్రాంతి కుమార్ పాటిల్ "కామాంధుడి కర్కశం.. చిన్నారి జీవితంతో చెలగాటం!" అత్యాచారం అనంతరం హత్యాయత్నం చేశాడని ఆరోపణలు.. ప్రాణాపాయ స్థితిలో బాధిత బాలిక సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 14, 2026 09:56 AM

రామలింగేశ్వరుని సన్నిధిలో సర్పంచ్ దంపతుల ప్రత్యేక పూజలు

రామలింగేశ్వరుని సన్నిధిలో సర్పంచ్ దంపతుల ప్రత్యేక పూజలు

రామలింగేశ్వరుని సన్నిధిలో సర్పంచ్ దంపతుల ప్రత్యేక పూజలు
January 18, 2026 08:23 PM 140 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అమావాస్య వేళ గుట్టపై రామలింగేశ్వరునికి మహాపూజలు.. భక్తులతో కిటకిటలాడిన ఆలయం

చిట్యాల స్థానికం ప్రతినిధి రిపోర్టర్ ప్రశాంత్

చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామ శివారులోని గుట్టపై శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం ఆదివారం అమావాస్య సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. గ్రామ సర్పంచ్ బత్తుల లక్ష్మీప్రసన్న నర్సింహ గౌడ్ దంపతులు స్వామివారికి అభిషేకాలు, గోత్రనామార్చనలు, ప్రత్యేక పూజలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.వేదమంత్రోచ్చారణల మధ్య అర్చకులు పూజలు కొనసాగించగా, భక్తులకు తీర్థప్రసాదాలు అందించి స్వామివారి ఆశీర్వచనాలు ప్రసాదించారు. అనంతరం కీ.శే. బత్తుల సాలయ్య గౌడ్–సత్తమ్మ దంపతుల పవిత్ర స్మృతికి గుర్తుగా వారి కుమారుడు, కోడలు అయిన సర్పంచ్ దంపతులు గుట్టపై భక్తులకు విస్తృతంగా అన్నదానం ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలిచారు.

ఈ సందర్భంగా సర్పంచ్ బత్తుల లక్ష్మీప్రసన్న నర్సింహ గౌడ్ మాట్లాడుతూ శ్రీ రామలింగేశ్వర స్వామి అనంత కృపతో గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని హృదయపూర్వకంగా ఆకాంక్షించారు.ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో దేవస్థానం కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామస్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనంతో పునీతులయ్యారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News