రక్తదానం.. ప్రాణదానానికి ముందడుగు
రక్తదానం.. ప్రాణదానానికి ముందడుగు
K.RAVI
రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని గట్టు శ్రీరాములు గార్డెన్లో ఆయాన్స్ భార్గవ్ సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా రక్తదాన శిబిరాన్ని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "రక్తదానం మహాదానం.. ఒకరు చేసిన రక్తదానం మరొకరి ప్రాణాలను కాపాడగలదు" అని అన్నారు. యువత సామాజిక బాధ్యతగా భావించి స్వచ్ఛందంగా రక్తదాన శిబిరాల్లో పాల్గొని మరెందరికో ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేసిన యువకులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించి, వారి సేవాభావాన్ని ప్రశంసించారు. సమాజానికి మేలు చేసే ఇటువంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఆయాన్స్ భార్గవ్ సేవ ట్రస్ట్ నిర్వాహకులను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ట్రస్ట్ సభ్యులు, యువత, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి