రాజాపేటలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు నర్సరీ, అవెన్యూ ప్లాంటేషన్, రెసిడెన్షియల్ పాఠశాల పరిశీలన
రాజాపేటలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు నర్సరీ, అవెన్యూ ప్లాంటేషన్, రెసిడెన్షియల్ పాఠశాల పరిశీలన
స్థానికం బృందం
రాజాపేట,: మండల కేంద్రంలోని నర్సరీని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పరిశీలించారు. ఈ సందర్భంగా మొత్తం ఎన్ని మొక్కలు నాటారు, వాటిలో ఏ ఏ రకాల మొక్కలు ఉన్నాయనే విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నర్సరీలో మొక్కలకు ప్రతిరోజూ నీరు పోస్తూ సంరక్షణ తీసుకోవాలని సూచించారు. నర్సరీని ఆహ్లాదకరమైన వాతావరణంగా తీర్చిదిద్దాలని అధికారులకు తెలిపారు.
తదనంతరం మండల కేంద్రంలోని అవెన్యూ ప్లాంటేషన్ను పరిశీలించిన కలెక్టర్ మొక్కలు నాటి వదిలేశారని, సరైన విధంగా నీరు పోయడం లేదని గమనించి సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెట్ల చుట్టూ గుంతలు తీసి ప్రతిరోజూ నీరు పోయాలని, చుట్టూ పెరిగిన పిచ్చి మొక్కలు తొలగించి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని ఎఫ్ఏకు ఆదేశించారు.
అనంతరం రాజాపేట మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించారు. పాఠశాలలోని కిచెన్ను పరిశీలించి మెనూ ప్రకారం విద్యార్థులకు ఏ భోజనం అందిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. భోజన నాణ్యత, స్టోరేజ్ గదులు, వంటకు ఉపయోగించే సరుకులను పరిశీలించారు. గుడ్లు, కూరగాయలు తాజాగా ఉండేలా చూడాలని సూచించారు.
విద్యార్థుల డార్మెటరీలను కూడా పరిశీలించి పడుకునే బెడ్లు సక్రమంగా ఉన్నాయా అని తనిఖీ చేశారు. విద్యార్థులు ఉపయోగించే టాయిలెట్లను పరిశీలించి ప్రతిరోజూ శుభ్రం చేయాలని, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి