Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 05:14 AM

రాజాపేటలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు నర్సరీ, అవెన్యూ ప్లాంటేషన్, రెసిడెన్షియల్ పాఠశాల పరిశీలన

రాజాపేటలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు నర్సరీ, అవెన్యూ ప్లాంటేషన్, రెసిడెన్షియల్ పాఠశాల పరిశీలన

రాజాపేటలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు నర్సరీ, అవెన్యూ ప్లాంటేషన్, రెసిడెన్షియల్ పాఠశాల పరిశీలన
March 13, 2026 03:51 PM 21 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రాజాపేట,: మండల కేంద్రంలోని నర్సరీని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పరిశీలించారు. ఈ సందర్భంగా మొత్తం ఎన్ని మొక్కలు నాటారు, వాటిలో ఏ ఏ రకాల మొక్కలు ఉన్నాయనే విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నర్సరీలో మొక్కలకు ప్రతిరోజూ నీరు పోస్తూ సంరక్షణ తీసుకోవాలని సూచించారు. నర్సరీని ఆహ్లాదకరమైన వాతావరణంగా తీర్చిదిద్దాలని అధికారులకు తెలిపారు.

తదనంతరం మండల కేంద్రంలోని అవెన్యూ ప్లాంటేషన్‌ను పరిశీలించిన కలెక్టర్ మొక్కలు నాటి వదిలేశారని, సరైన విధంగా నీరు పోయడం లేదని గమనించి సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెట్ల చుట్టూ గుంతలు తీసి ప్రతిరోజూ నీరు పోయాలని, చుట్టూ పెరిగిన పిచ్చి మొక్కలు తొలగించి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని ఎఫ్‌ఏకు ఆదేశించారు.

అనంతరం రాజాపేట మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించారు. పాఠశాలలోని కిచెన్‌ను పరిశీలించి మెనూ ప్రకారం విద్యార్థులకు ఏ భోజనం అందిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. భోజన నాణ్యత, స్టోరేజ్ గదులు, వంటకు ఉపయోగించే సరుకులను పరిశీలించారు. గుడ్లు, కూరగాయలు తాజాగా ఉండేలా చూడాలని సూచించారు.

విద్యార్థుల డార్మెటరీలను కూడా పరిశీలించి పడుకునే బెడ్‌లు సక్రమంగా ఉన్నాయా అని తనిఖీ చేశారు. విద్యార్థులు ఉపయోగించే టాయిలెట్లను పరిశీలించి ప్రతిరోజూ శుభ్రం చేయాలని, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News