రాజాపేట పీహెచ్సీపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ రోగులకు పూర్తి స్థాయి వైద్య సేవలు అందించాలి.
రాజాపేట పీహెచ్సీపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ రోగులకు పూర్తి స్థాయి వైద్య సేవలు అందించాలి.
స్థానికం బృందం
రాజాపేట,: మండలంలోని రాజాపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు అన్ని రకాల వైద్య సేవలు సమర్థంగా అందించాలని వైద్యాధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ పీహెచ్సీకి రోజూ ఎంతమంది రోగులు వస్తున్నారు, ఎంతమంది గర్భిణులు వైద్య సేవలు పొందుతున్నారు అనే విషయాలను ఆరా తీశారు. ఆస్పత్రికి వచ్చే ప్రతి రోగి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని, పరీక్షల అనంతరం ఇచ్చే చికిత్స, మందుల వివరాలను కూడా రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు.
ఆస్పత్రిలోని ల్యాబ్, మెడికల్ స్టోర్, లేబర్ రూమ్లను పరిశీలించారు. గత నెలలో జరిగిన డెలివరీల వివరాలు అడిగి తెలుసుకుని, సాధ్యమైనంత ఎక్కువగా సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు.
అదేవిధంగా ఆస్పత్రికి వచ్చిన రోగులతో మాట్లాడి వారు ఏ సమస్యతో వచ్చారో తెలుసుకున్నారు. అందుతున్న వైద్య సేవలపై వారి అభిప్రాయాలను కూడా అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి