Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 11:14 PM

రాజాపేట పీహెచ్‌సీపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ రోగులకు పూర్తి స్థాయి వైద్య సేవలు అందించాలి.

రాజాపేట పీహెచ్‌సీపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ రోగులకు పూర్తి స్థాయి వైద్య సేవలు అందించాలి.

రాజాపేట పీహెచ్‌సీపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ రోగులకు పూర్తి స్థాయి వైద్య సేవలు అందించాలి.
13-03-2026 24 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రాజాపేట,: మండలంలోని రాజాపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు అన్ని రకాల వైద్య సేవలు సమర్థంగా అందించాలని వైద్యాధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ పీహెచ్‌సీకి రోజూ ఎంతమంది రోగులు వస్తున్నారు, ఎంతమంది గర్భిణులు వైద్య సేవలు పొందుతున్నారు అనే విషయాలను ఆరా తీశారు. ఆస్పత్రికి వచ్చే ప్రతి రోగి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, పరీక్షల అనంతరం ఇచ్చే చికిత్స, మందుల వివరాలను కూడా రిజిస్టర్‌లో నమోదు చేయాలని సూచించారు.

ఆస్పత్రిలోని ల్యాబ్, మెడికల్ స్టోర్, లేబర్ రూమ్‌లను పరిశీలించారు. గత నెలలో జరిగిన డెలివరీల వివరాలు అడిగి తెలుసుకుని, సాధ్యమైనంత ఎక్కువగా సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు.

అదేవిధంగా ఆస్పత్రికి వచ్చిన రోగులతో మాట్లాడి వారు ఏ సమస్యతో వచ్చారో తెలుసుకున్నారు. అందుతున్న వైద్య సేవలపై వారి అభిప్రాయాలను కూడా అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు

Sthanikam

రాజాపేట పీహెచ్‌సీపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ రోగులకు పూర్తి స్థాయి వైద్య సేవలు అందించాలి.

Article Image

రాజాపేట,: మండలంలోని రాజాపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు అన్ని రకాల వైద్య సేవలు సమర్థంగా అందించాలని వైద్యాధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ పీహెచ్‌సీకి రోజూ ఎంతమంది రోగులు వస్తున్నారు, ఎంతమంది గర్భిణులు వైద్య సేవలు పొందుతున్నారు అనే విషయాలను ఆరా తీశారు. ఆస్పత్రికి వచ్చే ప్రతి రోగి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, పరీక్షల అనంతరం ఇచ్చే చికిత్స, మందుల వివరాలను కూడా రిజిస్టర్‌లో నమోదు చేయాలని సూచించారు.

ఆస్పత్రిలోని ల్యాబ్, మెడికల్ స్టోర్, లేబర్ రూమ్‌లను పరిశీలించారు. గత నెలలో జరిగిన డెలివరీల వివరాలు అడిగి తెలుసుకుని, సాధ్యమైనంత ఎక్కువగా సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు.

అదేవిధంగా ఆస్పత్రికి వచ్చిన రోగులతో మాట్లాడి వారు ఏ సమస్యతో వచ్చారో తెలుసుకున్నారు. అందుతున్న వైద్య సేవలపై వారి అభిప్రాయాలను కూడా అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News