రైతులకు నానో ఎరువులు, డ్రోన్ పరిజ్ఞానంపై అవగాహన కూసుమంచి రైతువేదికలో శిక్షణ కార్యక్రమం
రైతులకు నానో ఎరువులు, డ్రోన్ పరిజ్ఞానంపై అవగాహన కూసుమంచి రైతువేదికలో శిక్షణ కార్యక్రమం
స్థానికం బృందం
కూసుమంచి, రైతులు ఆధునిక సాంకేతికతను వినియోగించుకుంటే వ్యవసాయంలో మంచి ఫలితాలు సాధించవచ్చని కూసుమంచి విభాగ సహాయ వ్యవసాయ సంచాలకులు సతీష్తె లిపారు.
గురువారం కూసుమంచి మండలంలోని రైతు వేదికలో అగ్రికల్చరల్ టెక్నాలజీ మానేజ్మెంట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సతీష్ మాట్లాడుతూ వ్యవసాయంలో నానో ఎరువుల ప్రాముఖ్యత, డ్రోన్ పరిజ్ఞానం ద్వారా పంటల సంరక్షణ గురించి రైతులకు వివరించారు.
ఈ సందర్భంగా వైరా కృషి విగ్యాన్ కేంద్ర వ్యరా శాస్త్రవేత్త చైతన్య ప్రకృతి వ్యవసాయం అవసరాన్ని వివరించారు. అలాగే హెచ్టీ పత్తి సాగు వల్ల కలిగే నష్టాలు, భూసార పరీక్షల ప్రాముఖ్యతపై రైతులకు అవగాహన కల్పించారు.
పాలేరు విభాగ ఉద్యాన శాఖ అధికారి అపర్ణ పామాయిల్ సాగు విధానాలపై రైతులకు వివరించారు. అనంతరం మండల వ్యవసాయ అధికారి వాణి మాట్లాడుతూ పంట అవశేషాలను తగలబెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే వరిలో ప్రాధాన్యం గల రకాలను వివరించారు.
తరువాత రైతులకు డ్రోన్ ద్వారా పంటలపై మందు పిచికారీ చేసే విధానాన్ని క్షేత్రస్థాయిలో ప్రదర్శించారు. పశువైద్య శాఖ అధికారి Dr. నీలికాంత్ప శువులకు వచ్చే వ్యాధులు, వాటి నివారణ మార్గాలను వివరించారు.
ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ సభ్యులు, సాంకేతిక సహాయకురాలు అరుణ, వ్యవసాయ విస్తరణ అధికారులు జానీ, రవీందర్, వంశీ, రవికుమార్, నవీన్, సౌమ్య, ప్రియాంకతో పాటు రైతులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి