Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 05:15 AM

రైతులకు నానో ఎరువులు, డ్రోన్ పరిజ్ఞానంపై అవగాహన కూసుమంచి రైతువేదికలో శిక్షణ కార్యక్రమం

రైతులకు నానో ఎరువులు, డ్రోన్ పరిజ్ఞానంపై అవగాహన కూసుమంచి రైతువేదికలో శిక్షణ కార్యక్రమం

రైతులకు నానో ఎరువులు, డ్రోన్ పరిజ్ఞానంపై అవగాహన కూసుమంచి రైతువేదికలో శిక్షణ కార్యక్రమం
March 12, 2026 05:57 PM 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కూసుమంచి, రైతులు ఆధునిక సాంకేతికతను వినియోగించుకుంటే వ్యవసాయంలో మంచి ఫలితాలు సాధించవచ్చని కూసుమంచి విభాగ సహాయ వ్యవసాయ సంచాలకులు సతీష్తె లిపారు.

గురువారం కూసుమంచి మండలంలోని రైతు వేదికలో అగ్రికల్చరల్ టెక్నాలజీ మానేజ్మెంట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సతీష్ మాట్లాడుతూ వ్యవసాయంలో నానో ఎరువుల ప్రాముఖ్యత, డ్రోన్ పరిజ్ఞానం ద్వారా పంటల సంరక్షణ గురించి రైతులకు వివరించారు.

ఈ సందర్భంగా వైరా కృషి విగ్యాన్ కేంద్ర వ్యరా శాస్త్రవేత్త చైతన్య ప్రకృతి వ్యవసాయం అవసరాన్ని వివరించారు. అలాగే హెచ్‌టీ పత్తి సాగు వల్ల కలిగే నష్టాలు, భూసార పరీక్షల ప్రాముఖ్యతపై రైతులకు అవగాహన కల్పించారు.

పాలేరు విభాగ ఉద్యాన శాఖ అధికారి అపర్ణ పామాయిల్ సాగు విధానాలపై రైతులకు వివరించారు. అనంతరం మండల వ్యవసాయ అధికారి వాణి మాట్లాడుతూ పంట అవశేషాలను తగలబెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే వరిలో ప్రాధాన్యం గల రకాలను వివరించారు.

తరువాత రైతులకు డ్రోన్ ద్వారా పంటలపై మందు పిచికారీ చేసే విధానాన్ని క్షేత్రస్థాయిలో ప్రదర్శించారు. పశువైద్య శాఖ అధికారి Dr. నీలికాంత్ప శువులకు వచ్చే వ్యాధులు, వాటి నివారణ మార్గాలను వివరించారు.

ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ సభ్యులు, సాంకేతిక సహాయకురాలు అరుణ, వ్యవసాయ విస్తరణ అధికారులు జానీ, రవీందర్, వంశీ, రవికుమార్, నవీన్, సౌమ్య, ప్రియాంకతో పాటు రైతులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News