రైతులకు ఇబ్బందులు లేకుండా టోకెన్ విధానంలో కొనుగోళ్లు: అదనపు కలెక్టర్ వెంకారెడ్డి
రైతులకు ఇబ్బందులు లేకుండా టోకెన్ విధానంలో కొనుగోళ్లు: అదనపు కలెక్టర్ వెంకారెడ్డి
స్థానికం బృందం
రబీ వరి కొనుగోళ్లకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి
భువనగిరి: రబీ 2025–26 వరి ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ వెంకారెడ్డి అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాల వద్ద టోకెన్ పద్ధతిలో ధాన్యం స్వీకరించి సక్రమంగా సేకరణ జరిగేలా చూడాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ఎత్తుపల్లాలు పరిశీలించి సరైన ప్రదేశాలను ఎంపిక చేయాలని సూచించారు.
కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వేయింగ్ మెషీన్లు, ఆటోమేటిక్ ప్యాడీ క్లీనర్లు, తగినన్ని గన్నీ బ్యాగులు, టార్పాలిన్ షీట్లు సిద్ధంగా ఉంచాలని, ప్రతి కేంద్రానికి కనీసం 50 టార్పాలిన్ షీట్లు అందుబాటులో ఉండేలా చూడాలని చెప్పారు.
వేసవి దృష్ట్యా రైతులు, నిర్వాహకులు, సిబ్బందికి తాగునీరు, నీడ, షెడ్లు, టెంట్లు, కుర్చీలు వంటి సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని పీపీసీ కేంద్రాల్లో తూకపు యంత్రాలు, తేమ యంత్రాలు మార్చి 15లోగా సంబంధిత అధికారులచే ధృవీకరించుకోవాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్, జిల్లా సహకార అధికారి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, జిల్లా వ్యవసాయ అధికారి, జిల్లా మార్కెటింగ్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి