Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రోడ్డు భద్రతే ప్రాణ రక్షణ..భువనగిరిలో అవగాహన కార్యక్రమాలు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఐదు కొత్త కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్..! లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 16, 2026 12:11 AM

రైతుల ధాన్యం ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి

రైతుల ధాన్యం ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి

రైతుల ధాన్యం ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి
April 12, 2026 07:11 PM 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

రైతుల ధాన్యం ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి

కోదాడ మండల పరిధిలోని ద్వారకుంట గ్రామంలో చిమిర్యాల పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు గాదరి పుల్లారావు ఆధ్వర్యంలో పరిశీలించారు. కాగా ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శి వంగవీటి శ్రీనివాసరావు పాల్గొని రైతులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులు కోతలు కోసి నెల రోజులు గడుస్తున్న ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడం దారుణం అన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లో ఎప్పుడు ధాన్యం కొంటార అని ఎదురు చూస్తున్నారని మరోపక్క వాతావరణం మార్పులతో తీవ్ర ఆందోళనలో రైతాంగ ఉన్నదని ప్రభుత్వం ఎప్పటికైనా సత్వరమే స్పందించి ధాన్యం కొనుగోలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎరగని కళావతి, జిల్లా మాజీ కార్యవర్గ సభ్యులు ఎరగని రాధాకృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి రెడ్డి బోయిన జ్ఞానేంద్ర, మండల ఉపాధ్యక్షుడు భూమా శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షుడు జాబ్శెట్టి పూర్ణయ్య, ఎస్సీ సెల్ నాయకులు గుండెపంగు సైదులు, బంగారయ్య, బాబు, మరియు రైతులు బిజెపి కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు........


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News