రైతుల ధాన్యం ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి
రైతుల ధాన్యం ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి
Harish HS
రైతుల ధాన్యం ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి
కోదాడ మండల పరిధిలోని ద్వారకుంట గ్రామంలో చిమిర్యాల పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు గాదరి పుల్లారావు ఆధ్వర్యంలో పరిశీలించారు. కాగా ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శి వంగవీటి శ్రీనివాసరావు పాల్గొని రైతులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులు కోతలు కోసి నెల రోజులు గడుస్తున్న ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడం దారుణం అన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లో ఎప్పుడు ధాన్యం కొంటార అని ఎదురు చూస్తున్నారని మరోపక్క వాతావరణం మార్పులతో తీవ్ర ఆందోళనలో రైతాంగ ఉన్నదని ప్రభుత్వం ఎప్పటికైనా సత్వరమే స్పందించి ధాన్యం కొనుగోలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎరగని కళావతి, జిల్లా మాజీ కార్యవర్గ సభ్యులు ఎరగని రాధాకృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి రెడ్డి బోయిన జ్ఞానేంద్ర, మండల ఉపాధ్యక్షుడు భూమా శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షుడు జాబ్శెట్టి పూర్ణయ్య, ఎస్సీ సెల్ నాయకులు గుండెపంగు సైదులు, బంగారయ్య, బాబు, మరియు రైతులు బిజెపి కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు........

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి