రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం.. ధర్మారెడ్డి కాలువతో వేలాది ఎకరాలకు సాగునీటి వరం" – ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కుంభం అనిల్
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం.. ధర్మారెడ్డి కాలువతో వేలాది ఎకరాలకు సాగునీటి వరం" – ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కుంభం అనిల్
Editor Desk
భువనగిరి, నకిరేకల్ నియోజకవర్గాల రైతుల చిరకాల ఆకాంక్ష అయిన ధర్మారెడ్డి కాలువ ద్వారా సాగునీటిని సోమవారం ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి జీరో పాయింట్ వద్ద నుంచి విడుదల చేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ వేముల వీరేశం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీని అమలు చేస్తూ ధర్మారెడ్డి కాలువ పనులను వేగంగా పూర్తి చేశామని అన్నారు. ప్రజాపాలన ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని కాలువల ఆధునీకరణ చేపట్టిందని తెలిపారు.
ఈ నీటితో భువనగిరి, నకిరేకల్ నియోజకవర్గాల్లో వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు.భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో సాగునీటి కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధర్మారెడ్డి కాలువ పనులకు ప్రాధాన్యం ఇచ్చి పూర్తి చేసిందన్నారు. రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ సాగునీటిని అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి