రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలి.
రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలి.
Sthanikam District Staff Reporter
- కల్లూరి మల్లేశం, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు
ఆలేరు టౌన్; ఆలేరు సీపీఎం మండల కార్యాలయంలో మండల కమిటీ సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం మాట్లాడుతూ...యాసంగి సీజన్ ప్రారంభంలో ఇవ్వాల్సిన రైతు భరోసా నిధులు ఎన్నికల కోడ్ పేరు చెప్పి కాలయాపన చేసి ఎన్నికల కోడ్ ముగిసిన ఇంత వరకు ఇవ్వకపోవడం వలన రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని వెంటనే రైతు భరోసా నిధులు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలలో మహిళకు ఇస్తామన్న 2500 రూపాయలు ఇవ్వాలని, గత మూడు సంవత్సరాలుగా నూతన పింఛనులు మంజూరు చేయడం లేదని, అర్హులైన పేద ప్రజలకు పింఛను మంజూరు చేయాలని,రానున్న వేసవి కాలంలో గ్రామాలలో మంచి నీటి కొరత లేకుండా చూడాలని ప్రభుతాన్నిడిమాండ్ చేశారు. గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యలను అధ్యయనం చేస్తూ మార్చి 8 నుండి మార్చి 31 వరకు ఇంటింటికి సీపీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.ఈ సమావేశంలో మండల కార్యదర్శి దూపటి వెంకటేష్,మండల కార్యదర్శి సభ్యులు సూదగాని సత్య రాజయ్య,జూకంటి పౌల్,నల్ల మాస తులసయ్య,పిక్క గణేష్,శంకర్ రావణ్,చౌడబోయిన యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి