Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ను కలసిన బోగారం కాంగ్రెస్ నాయకులు ఎల్బీనగర్ వద్ద ఘోర ప్రమాదం: ఫ్లైఓవర్ పిల్లర్‌ను ఢీకొట్టిన టాటా ఏస్.. క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్! “500 గర్భిణులను బైక్‌లో రక్షించిన ప్రాణదాత: ఛత్తీస్‌గఢ్ ‘బైక్ హీరో’ సురేష్ బెల్సారే” చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 04, 2026 04:03 PM

రైతులతో ఆటలాడొద్దు ధాన్యం కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలి..

రైతులతో ఆటలాడొద్దు ధాన్యం కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలి..

రైతులతో ఆటలాడొద్దు ధాన్యం కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలి..
April 04, 2026 02:02 PM 64 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

ప్రభుత్వ నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ నాయకుల ధ్వజం..

తిప్పర్తి మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రాల పరిశీలన..

తిప్పర్తి : రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. శనివారం తిప్పర్తి మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆ పార్టీ నాయకుల బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ తండు సైదులు గౌడ్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు కందుల లక్ష్మయ్య, మాజీ మండల అధ్యక్షుడు శిరసవాడ సైదులు మాట్లాడారు. ఐకేపీ కేంద్రాలకు ధాన్యం వచ్చి నెల రోజులు కావస్తున్నా ఇంతవరకు కాంటాలు మొదలుపెట్టకపోవడం దారుణమని వారు విమర్శించారు. పీఏసీఎస్ (PACS) మరియు మహిళా సంఘాల మధ్య కావాలనే 'పంచాయతీ' పెట్టి గత వారం రోజులుగా కొనుగోలు ప్రక్రియను అధికార పార్టీ నాయకులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. గతంలో ఇదే సమయానికి మండలం నుండి సుమారు 50 వేల క్వింటాళ్ల ధాన్యం సేకరణ జరిగేదని కానీ నేడు ఒక్క బస్తా కూడా కొనకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ధ్వజమెత్తారు.

మిల్లర్లతో కుమ్మక్కై మోసాలు..

​ప్రభుత్వ కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో రైతులు గత్యంతరం లేక మిల్లర్లను ఆశ్రయిస్తున్నారని, దీనిని అదనుగా తీసుకుని మిల్లర్లు ధరలో కోత విధిస్తూ, తూకాల్లో మోసం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులు, మిల్లర్లు కుమ్మక్కై రైతుల పొట్ట కొడుతున్నారని విమర్శించారు. అకాల వర్షాలు కురిస్తే ఐకేపీ కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దయ్యే ప్రమాదం ఉందని, అప్పుడు రైతులకు జరిగే నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. జిల్లా అధికారులు ఇప్పటివరకు మిల్లులకు ట్యాగింగ్ చేయలేదు. కనీసం ట్రాన్స్‌పోర్ట్ లారీ ఏజెన్సీని కూడా ఖరారు చేయకపోవడం రైతులను ఇబ్బంది పెట్టడమే. రాబోయే రెండు మూడు రోజుల్లోగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో ప్రారంభించి, సేకరణ చేపట్టకపోతే రైతులతో కలిసి తిప్పర్తి మండల కేంద్రంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు భైరగోని శ్రీనివాస్, గుర్రం వెంకట్ రెడ్డి, వల్లపురెడ్డి వెంకట్ రెడ్డి మరియు పలువురు రైతులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News