రైల్వే నోటీసులతో రోడ్డున పడుతున్నాం. నిర్వాసిత కుటుంబాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి.
రైల్వే నోటీసులతో రోడ్డున పడుతున్నాం. నిర్వాసిత కుటుంబాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి.
Editor Desk
ఆర్డీవోకు వినతిపత్రం అందజేసిన బాధితులు.
యాదాద్రి భువనగిరి,
రాయగిరి రైల్వే స్టేషన్ సమీపంలో ఇళ్లు కోల్పోతున్న నిర్వాసిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ బాధితులు సోమవారం ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. రైల్వే శాఖ జారీ చేసిన ఖాళీ చేయాలనే నోటీసులతో తీవ్ర ఆందోళనకు గురయ్యామని వారు తెలిపారు.
ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. తాము తరతరాలుగా అదే ప్రాంతంలో నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నామని, ప్రభుత్వానికి సంబంధించిన పన్నులు, ఇతర చార్జీలు కూడా క్రమం తప్పకుండా చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా రైల్వే అధికారులు ఇళ్లు ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇళ్లు కోల్పోతున్న ప్రతి కుటుంబానికి తగిన నష్టపరిహారం చెల్లించడంతో పాటు ప్రభుత్వం నిర్మించే ఇళ్లలో నివాసం, ఇంటి స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలందరికీ పూర్తి న్యాయం జరిగే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి