Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కూసుకుంట్లవి 'పనికిమాలిన' పుకార్లే! అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఐదు కొత్త కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్..! లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 16, 2026 01:36 AM

రఘు ఆశయాలను సాధిస్తాం:పూర్ణ చందర్ రావు

రఘు ఆశయాలను సాధిస్తాం:పూర్ణ చందర్ రావు

రఘు ఆశయాలను సాధిస్తాం:పూర్ణ చందర్ రావు
February 25, 2026 06:52 PM 134 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

కోదాడ మాజీ ఎలక్ట్రాన్ మీడియా అధ్యక్షులు పరిశాల రఘు ఆశయాలను సాధించిన నాడే ఆయనకు మనం ఇచ్చే ఘన నివాళులు అని కోదాడ ఎలక్ట్రాన్ మీడియా గౌరవ అధ్యక్షులు పూర్ణ చందర్ రావు అన్నారు.రఘు ప్రథమ వర్ధంతి సందర్భంగా పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో విలేకరులు రఘు సమాధి వద్దకు వెళ్లి కొవ్వొత్తులు వెలిగించి పూలమాలలు సమాధి వద్ద ఉంచి నివాళులర్పించారు.అనంతరం పూర్ణ చందర్ రావు మాట్లాడుతూ..పడిశాల రఘు ఎలక్ట్రాన్ మీడియా రంగానికి ఎనలేని సేవలు చేసి ఎలక్ట్రాన్ మీడియా రంగం అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు.విలేకరుల ఆపదంటే అర్ధరాత్రి అయినా లెక్క చేయకుండా వారి సమస్యను పరిష్కరించిన తర్వాతనే తన పనులు చూసుకునేవాడని అలాంటి ఉన్నత విలువలు కలిగిన జర్నలిస్టును కోల్పోవడం ఎలక్ట్రాన్ మీడియా రంగానికి తీరని లోటు అని తెలిపారు వారి ఆత్మకు శాంతి చేకూరాలని శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో కోదాడ మాదిగ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు చెరుకుపల్లి శ్రీకాంత్ గౌరవ అధ్యక్షులు బంక వెంకటరత్నం ,చీమ చంద్రశేఖర్ ఏపూరి సునీల్ రత్నాకర్, ఎన్ శ్రీకాంత్ ,తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News