Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 04:56 AM

రచయితలు సమాజానికి మార్గదర్శకులు: ప్రొ. ఘంటా చక్రపాణి

రచయితలు సమాజానికి మార్గదర్శకులు: ప్రొ. ఘంటా చక్రపాణి

రచయితలు సమాజానికి మార్గదర్శకులు: ప్రొ. ఘంటా చక్రపాణి
March 14, 2026 06:44 PM 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రచయితలు సమాజానికి దారి చూపించే మార్గదర్శకులని, వారిని గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ తెలుగు శాఖ కళల విభాగం ఆధ్వర్యంలో రచయితల సంఘం రజతోత్సవం సందర్భంగా నిర్వహించిన “రైటర్స్ మీట్” కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రచయితలు, ప్రజలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసుకునేందుకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎల్లప్పుడూ వేదికగా ఉంటుందని తెలిపారు. రచయితలు తమ ఆలోచనలు, భావాలు, అనుభవాలను రచనల రూపంలో వ్యక్తపరచి సామాన్య ప్రజల సమస్యలకు గొంతుకగా మారాలని సూచించారు. రచయితల సంఘం స్థాపనకు 25 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా జరుపుకుంటున్న రజతోత్సవ వేడుకల్లో భాగస్వామ్యం కావడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొన్న ప్రముఖ రచయిత అల్లం రాజయ్య మాట్లాడుతూ విరసం వంటి ప్రగతిశీల సంస్థల ప్రభావంతోనే డెమోక్రటిక్ స్పేస్ కోసం రైటర్స్ మీట్ వంటి వేదికలు ఏర్పడ్డాయని అన్నారు. గత 25 సంవత్సరాలుగా తెలుగు సాహిత్య వ్యాప్తికి, అధ్యయనానికి ఈ సంస్థ చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో మాతృభాషకు సంక్షోభ కాలం నడుస్తోందని, దాన్ని అర్థం చేసుకొని భాషను కాపాడేందుకు రచయితలు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు యువ రచయితలకు ప్రేరణనిస్తాయని, వారు కూడా సమాజంలోని సామాన్య ప్రజల సమస్యలను ప్రతిబింబించేలా రచనలు చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత ఖదీర్ బాబు, ప్రఖ్యాత పాత్రికేయులు డా. కె. శ్రీనివాస్, రచయిత మరియు ‘వీక్షణం’ ఎడిటర్ ఎన్. వేణుగోపాల్, రచయితలు ఎల్.వి. రెడ్డి, కె.ఎన్. మళ్లీశ్వరి, కుప్పిలి పద్మ, బి.ఎస్. రాములు, ఎన్. రజని, వాసిరెడ్డి నవీన్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News