Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మంత్రి సవితమ్మ చేతుల మీదుగా ప్రారంభోత్సవం.. చైర్మన్, డైరెక్టర్లకు సత్కారం కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 01:37 PM

రాబోయే రంజాన్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి

రాబోయే రంజాన్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి

రాబోయే రంజాన్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి
March 04, 2026 07:49 PM 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

-అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

రాబోయే రంజాన్ పండుగను ప్రశాంతంగా, సామరస్య వాతావరణంలో నిర్వహించుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. బుధవారం కలెక్టరేట్ లోని మినీ మీటింగ్ హాలులో వివిధ శాఖల అధికారులు ముస్లిం మత పెద్దలు,వివిధ కుల సంఘాల నాయకులతో అడిషనల్ ఎస్పీ లక్ష్మీ నారాయణ తో కలిసి అదనపు కలెక్టర్ పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ..రంజాన్ పండుగను సోదరభావంతో,శాంతి భద్రతలకు భంగం కలగకుండా జరుపుకోవాలన్నారు. ప్రార్థనా స్థలాల వద్ద తాగునీరు, పారిశుధ్యం,విద్యుత్,ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ వంటి మౌలిక సదుపాయాలను సంబంధిత శాఖలు సమన్వయంతో ఏర్పాటు చేయాలని ఆదేశించారు.పోలీస్ శాఖ అధికారులు పండుగ రోజుల్లో ప్రత్యేక బందోబస్తు,ట్రాఫిక్ నిర్వహణ చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ పండుగను సంతోషంగా జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ సూచించారు. ప్రజల సహకారంతో రంజాన్ పండుగను విజయవంతంగా పూర్తి సమన్వయంతో పండుగ జరపాలన్నారు.ఈ సమావేశంలో మైనారిటీ సంక్షమే అధికారిని జయమ్మ,మున్సిపల్ చైర్మన్ తంగెళ్లపల్లి శ్రీవాణి రవికుమార్,సంబంధిత శాఖల అధికారులు,పీస్ కమిటీ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News