కృష్ణాజిల్లాలో రబీ 2025–26 సీజన్లో రైతులు సాగు చేసిన అపరాలను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్లు జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ తెలిపారు.
ప్రభుత్వం మినుములకు క్వింటాలుకు రూ. 7,800 మద్దతు ధరను, పెసలకు క్వింటాలుకు రూ. 8,768 మద్దతు ధరను నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తమ పంటను తీసుకురావాలని సూచించారు.
రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి