పోటీ పరీక్షలకు నల్గొండలో ‘ఫోకస్’ శిక్షణ కేంద్రం ప్రారంభం. శ్రీనివాస్ రెడ్డి
పోటీ పరీక్షలకు నల్గొండలో ‘ఫోకస్’ శిక్షణ కేంద్రం ప్రారంభం. శ్రీనివాస్ రెడ్డి
Editor Desk
విద్యార్థుల భవిష్యత్తుకు నూతన దిశగా ‘ఫోకస్’ హై స్కూల్
నల్గొండ, ఆదివారం: నల్గొండ పట్టణంలోని రామగిరి పద్మజ్యోతి కాంప్లెక్స్లో విజ్ఞాన్ జ్యోతి హై స్కూల్ ‘ఫోకస్’ బ్రాంచ్ను ఉమ్మడి నల్గొండ జిల్లా ఎస్ఆర్ జోనల్ ఇన్చార్జ్ దోనాల శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పట్టణంతో పాటు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో దోనాల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, మారుతున్న విద్యా విధానాలకు అనుగుణంగా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తూ, పోటీ పరీక్షలకు సమగ్రంగా సిద్ధం చేసే విధంగా ‘ఫోకస్’ బ్యాచ్ను రూపొందించినట్లు తెలిపారు. విలువలతో కూడిన విద్యతో పాటు మేధాశక్తి అభివృద్ధికి ప్రత్యేక కరికులం అందించడం ఈ సంస్థ ముఖ్య లక్ష్యమన్నారు.
జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో నల్గొండ విద్యార్థులను ముందంజలో నిలబెట్టేలా అత్యున్నత శిక్షణ అందిస్తామని చెప్పారు.
ఈ సందర్భంగా ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ ఎనగందుల వరదారెడ్డి, డైరెక్టర్ సంతోష్ రెడ్డి, సీఈఓ సురేందర్ రెడ్డి నూతన ఫోకస్ బ్రాంచ్ ప్రారంభంపై అభినందనలు తెలిపారు.
కార్యక్రమంలో పద్మజ్యోతి కాంప్లెక్స్ చైర్మన్ మీరిలా యాదగిరి, ఎస్ఆర్ కాలేజ్, స్కూల్ ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి