Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోటీ పరీక్షలకు నల్గొండలో ‘ఫోకస్’ శిక్షణ కేంద్రం ప్రారంభం. శ్రీనివాస్ రెడ్డి 14 ఏళ్ల సెంటిమెంట్‌ బద్దలు.. కేకేఆర్‌పై ముంబై రికార్డ్ విక్టరీ.. చెలరేగిన రోహిత్, రికెల్టన్! ప్రభుత్వ ఉద్యోగుల సేవలు, వసతి సౌకర్యాలపై బాబాసాహెబ్ అంబేడ్కర్ స్పష్టత: నాగ భీమ్ డైరీ (29 మార్చి 1945). తెలంగాణలో ఉరుములు–మెరుపులతో కురిసే భారీ వర్షాలు: డప్పూర్‌లో ఉర్సు మహోత్సవం ఘనంగా అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 30, 2026 11:34 AM

పోటీ పరీక్షలకు నల్గొండలో ‘ఫోకస్’ శిక్షణ కేంద్రం ప్రారంభం. శ్రీనివాస్ రెడ్డి

పోటీ పరీక్షలకు నల్గొండలో ‘ఫోకస్’ శిక్షణ కేంద్రం ప్రారంభం. శ్రీనివాస్ రెడ్డి

పోటీ పరీక్షలకు నల్గొండలో ‘ఫోకస్’ శిక్షణ కేంద్రం ప్రారంభం. శ్రీనివాస్ రెడ్డి
March 30, 2026 09:24 AM 10 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

విద్యార్థుల భవిష్యత్తుకు నూతన దిశగా ‘ఫోకస్’ హై స్కూల్

నల్గొండ, ఆదివారం: నల్గొండ పట్టణంలోని రామగిరి పద్మజ్యోతి కాంప్లెక్స్‌లో విజ్ఞాన్ జ్యోతి హై స్కూల్ ‘ఫోకస్’ బ్రాంచ్‌ను ఉమ్మడి నల్గొండ జిల్లా ఎస్‌ఆర్ జోనల్ ఇన్‌చార్జ్ దోనాల శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పట్టణంతో పాటు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో దోనాల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, మారుతున్న విద్యా విధానాలకు అనుగుణంగా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తూ, పోటీ పరీక్షలకు సమగ్రంగా సిద్ధం చేసే విధంగా ‘ఫోకస్’ బ్యాచ్‌ను రూపొందించినట్లు తెలిపారు. విలువలతో కూడిన విద్యతో పాటు మేధాశక్తి అభివృద్ధికి ప్రత్యేక కరికులం అందించడం ఈ సంస్థ ముఖ్య లక్ష్యమన్నారు.

జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో నల్గొండ విద్యార్థులను ముందంజలో నిలబెట్టేలా అత్యున్నత శిక్షణ అందిస్తామని చెప్పారు.

ఈ సందర్భంగా ఎస్‌ఆర్ విద్యాసంస్థల చైర్మన్ ఎనగందుల వరదారెడ్డి, డైరెక్టర్ సంతోష్ రెడ్డి, సీఈఓ సురేందర్ రెడ్డి నూతన ఫోకస్ బ్రాంచ్ ప్రారంభంపై అభినందనలు తెలిపారు.

కార్యక్రమంలో పద్మజ్యోతి కాంప్లెక్స్ చైర్మన్ మీరిలా యాదగిరి, ఎస్‌ఆర్ కాలేజ్, స్కూల్ ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News