Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నియోజకవర్గ సమస్యల పరిష్కారమే లక్ష్యం – ముఖ్యమంత్రిని కలిసిన ఖేఢ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 31, 2026 01:00 AM

ఫైర్ ఫై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి

ఫైర్ ఫై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి

ఫైర్ ఫై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి
May 29, 2026 08:44 PM 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికల 99 రోజులలో భాగంగా స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో అగ్నిమాపక అధికారి కందుల డాక్టర్ బాబు ఆధ్వర్యంలో ఫైర్ ఫై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తహసీల్దార్ సంతోష్ కిరణ్ పాల్గొని అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు డీసీపీ, సిఓటును ఎలా ఉపయోగించాలో మాక్ ఢిల్లీ ద్వారా చూయించారు. అనంతరం తహసిల్దార్ మాట్లాడుతూ మనం విధులు నిర్వహిస్తున్న కార్యాలయాలలో, మనం నివసిస్తున్న ప్రాంతాలలో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఆ ప్రమాదాలను నివారించడానికి పాటించవలసిన నిబంధనలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. మీరు ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరుగుతున్న దాన్ని చూసినట్లయితే తక్షణమే 101 కి కాల్ చేసి ఆ అగ్ని ప్రమాదాన్ని నివారించడానికి సహకరించాలని అన్నారు. ఈ వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా సంభవించే అవకాశాలు ఉన్నందున ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ముఖ్యంగా రైతులు పంట పొలాలలో గడ్డిని తగలబెట్టడం వలన రోడ్ల వెంబడి చెట్లు అలాగే గడ్డివాములు కొన్ని ప్రాంతాలలో ఇల్లు అగ్ని ప్రమాదానికి గురి అవుతున్నాయి కావున రైతులు పొలాలలో గడ్డిని తగలబెట్టకుండా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది రఫీ, నాగార్జున, మోహన్, జగన్, నాయకులు భాషాబోయిన భాస్కర్, ఫైర్ సిబ్బంది జి శ్రీనివాసరావు, నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News