ఫైర్ ఫై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి
ఫైర్ ఫై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి
Harish K
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికల 99 రోజులలో భాగంగా స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో అగ్నిమాపక అధికారి కందుల డాక్టర్ బాబు ఆధ్వర్యంలో ఫైర్ ఫై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తహసీల్దార్ సంతోష్ కిరణ్ పాల్గొని అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు డీసీపీ, సిఓటును ఎలా ఉపయోగించాలో మాక్ ఢిల్లీ ద్వారా చూయించారు. అనంతరం తహసిల్దార్ మాట్లాడుతూ మనం విధులు నిర్వహిస్తున్న కార్యాలయాలలో, మనం నివసిస్తున్న ప్రాంతాలలో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఆ ప్రమాదాలను నివారించడానికి పాటించవలసిన నిబంధనలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. మీరు ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరుగుతున్న దాన్ని చూసినట్లయితే తక్షణమే 101 కి కాల్ చేసి ఆ అగ్ని ప్రమాదాన్ని నివారించడానికి సహకరించాలని అన్నారు. ఈ వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా సంభవించే అవకాశాలు ఉన్నందున ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ముఖ్యంగా రైతులు పంట పొలాలలో గడ్డిని తగలబెట్టడం వలన రోడ్ల వెంబడి చెట్లు అలాగే గడ్డివాములు కొన్ని ప్రాంతాలలో ఇల్లు అగ్ని ప్రమాదానికి గురి అవుతున్నాయి కావున రైతులు పొలాలలో గడ్డిని తగలబెట్టకుండా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది రఫీ, నాగార్జున, మోహన్, జగన్, నాయకులు భాషాబోయిన భాస్కర్, ఫైర్ సిబ్బంది జి శ్రీనివాసరావు, నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి