Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాళేశ్వరం పై కక్షసాధింపుకు బ్రేక్ – హైకోర్టు స్టేతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 10:35 PM

పెనుకొండలో సత్యసాయి డిగ్రీ కళాశాలపై ఆరోపణలు – ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలి:ఏఐఎస్ఏ

పెనుకొండలో సత్యసాయి డిగ్రీ కళాశాలపై ఆరోపణలు – ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలి:ఏఐఎస్ఏ

పెనుకొండలో సత్యసాయి డిగ్రీ కళాశాలపై ఆరోపణలు – ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలి:ఏఐఎస్ఏ
March 06, 2026 07:45 PM 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పెనుకొండ: పట్టణంలోని శ్రీ సత్యసాయి డిగ్రీ కళాశాలలో జరుగుతున్న అక్రమాలు, విద్యార్థులపై జరుగుతున్న వేధింపులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) డిమాండ్ చేసింది. ఈ మేరకు శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం సీడీసీ డీన్ ప్రొఫెసర్ రంగోపాల్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు శివకుమార్ మాట్లాడుతూ, కళాశాల ప్రధానాచార్యుడు ఆదిశేషరెడ్డి అధికార పార్టీ అండదండలతో ప్రభుత్వ నిబంధనలు, ఆదేశాలను పట్టించుకోకుండా కళాశాలను స్వంత ఆస్తిలా నడుపుతున్నారని ఆరోపించారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

ఇంటర్మీడియట్ పరీక్షల సమయంలో సత్యసాయి ఇంటర్మీడియట్ కళాశాలలో పరీక్షలు రాయడానికి వచ్చిన విద్యార్థులను అడ్డుకోవడం, వారి వివరాలను బలవంతంగా సేకరించడం, ఫోన్ నంబర్లు తీసుకోవడం వల్ల విద్యార్థుల పరీక్ష సమయం వృథా అయిందని పేర్కొన్నారు. ఇది విద్యా వ్యవస్థను అవమానపరిచే చర్య అని ఏఐఎస్ఏ నాయకులు విమర్శించారు.

అదేవిధంగా డిగ్రీ విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయడం, చదువు పూర్తిచేసిన విద్యార్థులకు ధ్రువపత్రాలు ఇవ్వకుండా కళాశాలలోనే నిలిపివేయడం వంటి చర్యలతో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. కళాశాలకు రాని విద్యార్థులకు కూడా హాజరు నమోదు చేసి, వివిధ ఫీజుల పేర్లతో వేల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

పరీక్షలు రాయడానికి వచ్చే ఇతర కళాశాలల విద్యార్థులకు కనీస సదుపాయాలు కల్పించకపోవడం, గేటు బయట రోడ్లపై నిలబెట్టి కళాశాల ప్రాంగణంలోకి అనుమతి ఇవ్వకపోవడం విద్యార్థుల హక్కులను ఉల్లంఘించే చర్య అని పేర్కొన్నారు.

కాబట్టి వెంటనే పూర్తి స్థాయి విచారణ జరిపి శ్రీ సత్యసాయి డిగ్రీ కళాశాలను పరీక్షా కేంద్రంగా రద్దు చేయాలని, కళాశాల గుర్తింపును తొలగించాలని, ప్రధానాచార్యుడు ఆదిశేషరెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఏ డిమాండ్ చేసింది. విద్యను వ్యాపారంగా మార్చి విద్యార్థులను దోచుకునే యాజమాన్యాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే విద్యార్థి ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ బాలకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షుడు భీమేష్, జిల్లా నాయకుడు రమేష్ తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News