పెనుకొండలో మంత్రి సవిత ప్రజా దర్బార్ – సమస్యల పరిష్కారానికి తక్షణ ఆదేశాలు
పెనుకొండలో మంత్రి సవిత ప్రజా దర్బార్ – సమస్యల పరిష్కారానికి తక్షణ ఆదేశాలు
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆమె నేరుగా ప్రజల వినతులను స్వీకరించారు.ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు
ఈ సందర్భంగా ప్రతి అర్జీని ప్రాధాన్యతగా పరిగణించి, సంబంధిత అధికారులతో వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో ఎటువంటి ఆలస్యం జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు భూవివాదాలు, పింఛన్లు, రేషన్ కార్డులు, తాగునీటి సమస్యలు వంటి అంశాలపై తమ వినతిపత్రాలను సమర్పించారు.
ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకోవడం ద్వారా త్వరితగతిన పరిష్కారం అందించగలమని మంత్రి సవిత పేర్కొన్నారు. ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకత, బాధ్యతాయుత విధానాలే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి