Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామలింగేశ్వర ఆలయంలో నవగ్రహ మండప శంకుస్థాపన కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 25, 2026 04:57 AM

పెనుకొండలో మహిళా దినోత్సవ వేడుకలు 9కి వాయిదా

పెనుకొండలో మహిళా దినోత్సవ వేడుకలు 9కి వాయిదా

పెనుకొండలో మహిళా దినోత్సవ వేడుకలు 9కి వాయిదా
March 07, 2026 11:35 PM 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పెనుకొండ, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పెనుకొండ పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానంలో ఈ నెల 8వ తేదీన నిర్వహించాల్సిన మహిళా దినోత్సవ వేడుకలు అనివార్య కారణాల వల్ల మార్చి 9వ తేదీ సోమవారం సాయంత్రం 3 గంటలకు నిర్వహించనున్నట్లు ఎన్డీయే కూటమి నాయకులు తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సంక్షేమ, ఈడబ్ల్యూఎస్, చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

కార్యక్రమంలో భాగంగా మార్చి 9న సాయంత్రం 3 గంటలకు అంబేద్కర్ సర్కిల్ వద్ద గల ఎమ్మార్వో కార్యాలయం ఆవరణలో అందరూ చేరుకోవాలని తెలిపారు. అక్కడ మంత్రి సవితమ్మ బస్సు ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన బస్ షెల్టర్‌ను ప్రారంభిస్తారు. అనంతరం అంబేద్కర్ సర్కిల్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా జూనియర్ కళాశాల మైదానం వరకు ర్యాలీ నిర్వహిస్తారు.

జూనియర్ కళాశాల మైదానంలో మంత్రి సవితమ్మ సౌజన్యంతో నూతనంగా నిర్మించిన స్టేజ్‌ను ప్రారంభించి అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభ నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమానికి మహిళలు, టీడీపీ–బీజేపీ–జనసేన కూటమి నాయకులు, కార్యకర్తలు, ఆర్పీలు, యానిమేటర్లు, మహిళా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎన్డీయే కూటమి నాయకులు కోరారు.

ఈ సమావేశంలో పెనుకొండ టీడీపీ అర్బన్ కన్వీనర్ శ్రీరాములు, మహిళా అధ్యక్షురాలు రమణమ్మ, చంద్రకాంతమ్మ, డ్వాక్రా రామాంజనేయులు, ప్రభంజన్ స్వామి, సాయిప్రసాద్, ఆర్పీలు, యానిమేటర్లు తదితరులు పాల్గొన్నారు


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News