Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా బుక్ రివ్యూ కార్యక్రమం కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 05:23 AM

పెనుకొండలో మహిళా దినోత్సవ వేడుకలు 9కి వాయిదా

పెనుకొండలో మహిళా దినోత్సవ వేడుకలు 9కి వాయిదా

పెనుకొండలో మహిళా దినోత్సవ వేడుకలు 9కి వాయిదా
March 07, 2026 11:35 PM 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పెనుకొండ, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పెనుకొండ పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానంలో ఈ నెల 8వ తేదీన నిర్వహించాల్సిన మహిళా దినోత్సవ వేడుకలు అనివార్య కారణాల వల్ల మార్చి 9వ తేదీ సోమవారం సాయంత్రం 3 గంటలకు నిర్వహించనున్నట్లు ఎన్డీయే కూటమి నాయకులు తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సంక్షేమ, ఈడబ్ల్యూఎస్, చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

కార్యక్రమంలో భాగంగా మార్చి 9న సాయంత్రం 3 గంటలకు అంబేద్కర్ సర్కిల్ వద్ద గల ఎమ్మార్వో కార్యాలయం ఆవరణలో అందరూ చేరుకోవాలని తెలిపారు. అక్కడ మంత్రి సవితమ్మ బస్సు ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన బస్ షెల్టర్‌ను ప్రారంభిస్తారు. అనంతరం అంబేద్కర్ సర్కిల్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా జూనియర్ కళాశాల మైదానం వరకు ర్యాలీ నిర్వహిస్తారు.

జూనియర్ కళాశాల మైదానంలో మంత్రి సవితమ్మ సౌజన్యంతో నూతనంగా నిర్మించిన స్టేజ్‌ను ప్రారంభించి అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభ నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమానికి మహిళలు, టీడీపీ–బీజేపీ–జనసేన కూటమి నాయకులు, కార్యకర్తలు, ఆర్పీలు, యానిమేటర్లు, మహిళా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎన్డీయే కూటమి నాయకులు కోరారు.

ఈ సమావేశంలో పెనుకొండ టీడీపీ అర్బన్ కన్వీనర్ శ్రీరాములు, మహిళా అధ్యక్షురాలు రమణమ్మ, చంద్రకాంతమ్మ, డ్వాక్రా రామాంజనేయులు, ప్రభంజన్ స్వామి, సాయిప్రసాద్, ఆర్పీలు, యానిమేటర్లు తదితరులు పాల్గొన్నారు


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News