Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లెక్కల మాస్టారైన జిల్లా కలెక్టర్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 11:55 PM

పెనుకొండలో “జలం–జీవం” నినాదంతో చెరువు శుభ్రత కార్యక్రమం

పెనుకొండలో “జలం–జీవం” నినాదంతో చెరువు శుభ్రత కార్యక్రమం

పెనుకొండలో “జలం–జీవం” నినాదంతో చెరువు శుభ్రత కార్యక్రమం
April 18, 2026 02:14 PM 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో “జలం–జీవం” అనే ప్రధాన నినాదంతో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం భాగంగా భోగసముద్రం చెరువులో విస్తృత స్థాయిలో శుభ్రత కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ, చేనేత & జౌళి శాఖల మంత్రి సవిత స్వయంగా పాల్గొని చెరువులోని చెత్తను తొలగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నీటి వనరుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, “జలం ఉంటేనే జీవం ఉంటుంది” అనే భావనను ప్రజల్లో నాటేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

చెరువులు, కాలువలు శుభ్రంగా ఉంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవచ్చని ఆమె పేర్కొన్నారు. అనంతరం అధికారులు, స్థానిక ప్రజలతో కలిసి స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని శుభ్రతకు తమ మద్దతు తెలిపారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News