పెనుకొండలో “జలం–జీవం” నినాదంతో చెరువు శుభ్రత కార్యక్రమం
పెనుకొండలో “జలం–జీవం” నినాదంతో చెరువు శుభ్రత కార్యక్రమం
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో “జలం–జీవం” అనే ప్రధాన నినాదంతో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం భాగంగా భోగసముద్రం చెరువులో విస్తృత స్థాయిలో శుభ్రత కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ, చేనేత & జౌళి శాఖల మంత్రి సవిత స్వయంగా పాల్గొని చెరువులోని చెత్తను తొలగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నీటి వనరుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, “జలం ఉంటేనే జీవం ఉంటుంది” అనే భావనను ప్రజల్లో నాటేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
చెరువులు, కాలువలు శుభ్రంగా ఉంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవచ్చని ఆమె పేర్కొన్నారు. అనంతరం అధికారులు, స్థానిక ప్రజలతో కలిసి స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని శుభ్రతకు తమ మద్దతు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి