Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 04:59 AM

పెనుకొండలో “జలం–జీవం” నినాదంతో చెరువు శుభ్రత కార్యక్రమం

పెనుకొండలో “జలం–జీవం” నినాదంతో చెరువు శుభ్రత కార్యక్రమం

పెనుకొండలో “జలం–జీవం” నినాదంతో చెరువు శుభ్రత కార్యక్రమం
18-04-2026 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో “జలం–జీవం” అనే ప్రధాన నినాదంతో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం భాగంగా భోగసముద్రం చెరువులో విస్తృత స్థాయిలో శుభ్రత కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ, చేనేత & జౌళి శాఖల మంత్రి సవిత స్వయంగా పాల్గొని చెరువులోని చెత్తను తొలగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నీటి వనరుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, “జలం ఉంటేనే జీవం ఉంటుంది” అనే భావనను ప్రజల్లో నాటేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

చెరువులు, కాలువలు శుభ్రంగా ఉంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవచ్చని ఆమె పేర్కొన్నారు. అనంతరం అధికారులు, స్థానిక ప్రజలతో కలిసి స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని శుభ్రతకు తమ మద్దతు తెలిపారు.


Sthanikam

పెనుకొండలో “జలం–జీవం” నినాదంతో చెరువు శుభ్రత కార్యక్రమం

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో “జలం–జీవం” అనే ప్రధాన నినాదంతో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం భాగంగా భోగసముద్రం చెరువులో విస్తృత స్థాయిలో శుభ్రత కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ, చేనేత & జౌళి శాఖల మంత్రి సవిత స్వయంగా పాల్గొని చెరువులోని చెత్తను తొలగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నీటి వనరుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, “జలం ఉంటేనే జీవం ఉంటుంది” అనే భావనను ప్రజల్లో నాటేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

చెరువులు, కాలువలు శుభ్రంగా ఉంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవచ్చని ఆమె పేర్కొన్నారు. అనంతరం అధికారులు, స్థానిక ప్రజలతో కలిసి స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని శుభ్రతకు తమ మద్దతు తెలిపారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News