Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామన్నపేటలో బీజేపీ బిఎల్ఏ-2 కార్యశాల కదం తొక్కిన గిల్.. కోల్‌కతాపై గుజరాత్‌ ఘన విజయం రైతు కుటుంబానికి అండగా రెడ్స్ సంస్థ ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 18, 2026 07:40 PM

పెనుకొండలో ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ 1000 రోజులు పూర్తి – ఘనంగా వేడుకలు

పెనుకొండలో ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ 1000 రోజులు పూర్తి – ఘనంగా వేడుకలు

పెనుకొండలో ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ 1000 రోజులు పూర్తి – ఘనంగా వేడుకలు
April 18, 2026 05:23 PM 6 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పెనుకొండ : పెనుకొండలో ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సవిత హాజరై క్యాంటీన్ వద్ద కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం అక్కడికి వచ్చిన ప్రజలకు స్వయంగా భోజనం వడ్డించి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి Y. S. జగన్ మోహన్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు. అన్నా క్యాంటీన్లను నిలిపివేసి పేదలకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం N. తారక రామ రావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని తెలిపారు.

గతంలో N. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పెద్ద ఎత్తున అన్నా క్యాంటీన్లు ప్రారంభించి పేదలకు తక్కువ ధరకే భోజనం అందించారని గుర్తుచేశారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా రూ.5కే భోజనం అందించేలా క్యాంటీన్లు నిర్వహించామని చెప్పారు. నేటితో 1000 రోజులు పూర్తి కావడం ఆనందకరమని పేర్కొన్నారు.


అన్నా క్యాంటీన్ ప్రారంభ సమయంలో వైసీపీ నాయకులు అడ్డంకులు సృష్టించారని, అయితే తిరిగి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించి పేదల ఆకలి తీర్చుతున్నామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వందలాది అన్నా క్యాంటీన్ల ద్వారా నిరుపేదలకు రూ.5కే భోజనం అందిస్తున్నామని వివరించారు.


ఇంకా, ముఖ్యమంత్రి N. చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా పెనుకొండలో అధికారికంగా మరో అన్నా క్యాంటీన్ ప్రారంభించనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. అలాగే త్వరలో గోరంట్ల మండలంలో కూడా సొంత నిధులతో క్యాంటీన్ ప్రారంభించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News