Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 08, 2026 01:48 AM

పెనుకొండలో బహుజన చైతన్య వేదిక ర్యాలీ, తపాలా కార్యాలయం ముట్టడి

పెనుకొండలో బహుజన చైతన్య వేదిక ర్యాలీ, తపాలా కార్యాలయం ముట్టడి

పెనుకొండలో బహుజన చైతన్య వేదిక ర్యాలీ, తపాలా కార్యాలయం ముట్టడి
March 07, 2026 11:35 PM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పెనుకొండ: ఆర్‌డీటీ సంస్థకు ఎఫ్‌సీఆర్‌ఏ (FCRA) లైసెన్స్‌ను తక్షణం పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ బహుజన చైతన్య వేదిక ఆధ్వర్యంలో పెనుకొండ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే తపాలా శాఖ కార్యాలయాన్ని ముట్టడించారు.

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గ కేంద్రంలో బహుజన చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు శివరామకృష్ణ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. తహశీల్దార్ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ అంబేద్కర్ సర్కిల్, దర్గా సర్కిల్, ఎస్‌కేడీ సర్కిల్, తెలుగుతల్లి సర్కిల్, ఎన్‌టీఆర్ సర్కిల్ మీదుగా పట్టణంలోని తపాలా శాఖ కార్యాలయం వరకు కొనసాగింది.

ఈ సందర్భంగా శివరామకృష్ణ మాట్లాడుతూ ఆర్‌డీటీ సంస్థకు FCRA రెన్యువల్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. లేని పక్షంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాలయాలను ముట్టడి చేస్తూ తీవ్ర ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆర్‌డీటీ సంస్థ అందిస్తున్న సేవలు ఎంతో ఉపయోగకరమని, ఆ సేవలకు ఆటంకం కలిగించడం బాధాకరమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జనసంఘం వ్యవస్థాపకులు దాసాగానిపల్లె కుళ్ళయ్యప్ప, జై భీమ్ భారత్ పార్టీ నాయకులు, రాయలసీమ కోఆర్డినేటర్ చల్లాపల్లి ఈశ్వర్, రంగేపల్లి కదిరప్ప, నరసింహులు తదితరులు పాల్గొన్నారు


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News