Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 05:36 AM

పెనుకొండలో అవగాహన ర్యాలీ: బాలికల భద్రత, రోడ్డు నియమాలపై చైతన్యం

పెనుకొండలో అవగాహన ర్యాలీ: బాలికల భద్రత, రోడ్డు నియమాలపై చైతన్యం

పెనుకొండలో అవగాహన ర్యాలీ: బాలికల భద్రత, రోడ్డు నియమాలపై చైతన్యం
21-04-2026 54 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Somandepalli
Prakash

పెనుకొండ: బాలికలపై జరిగే నేరాలను అరికట్టేందుకు పోక్సో చట్టంపై అవగాహన ప్రతి ఆడపిల్లకు తప్పనిసరిగా ఉండాలని అధికారులు సూచించారు. గుడ్ టచ్–బ్యాడ్ టచ్ గురించి స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. అనుచితంగా ప్రవర్తించే వ్యక్తులు బంధువులు, పక్కింటివారు, లేదా కుటుంబ సభ్యులే అయినా వెంటనే తల్లిదండ్రులకు తెలియజేయాలని బాలికలకు సూచించారు.

మహిళలు, బాలికల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు ఉన్నాయని, వారి భద్రత కోసం పోలీసులు 24 గంటలు పని చేస్తున్నారని తెలిపారు.

అలాగే రోడ్డు భద్రతపై మాట్లాడుతూ, పెట్రోల్ బంక్‌ల వద్ద హెల్మెట్ ధరించినవారికే ఇంధనం అందించాలని నిర్వాహకులు కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు. యువత మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

సత్యసాయి జిల్లాలో ప్రతిరోజూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో “అతివేగం కన్నా ప్రాణం మిన్న” అని అవగాహన కల్పించారు.

ఈ మేరకు పెనుకొండలో ఎస్‌ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ఎస్పీ సతీష్, ఆర్‌టీఓ కరుణసాగర్ రెడ్డి, డీఎస్పీ నరసింగప్ప, ఎంవీఐ స్వాతి, ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పెనుకొండలో అవగాహన ర్యాలీ: బాలికల భద్రత, రోడ్డు నియమాలపై చైతన్యం

Article Image

పెనుకొండ: బాలికలపై జరిగే నేరాలను అరికట్టేందుకు పోక్సో చట్టంపై అవగాహన ప్రతి ఆడపిల్లకు తప్పనిసరిగా ఉండాలని అధికారులు సూచించారు. గుడ్ టచ్–బ్యాడ్ టచ్ గురించి స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. అనుచితంగా ప్రవర్తించే వ్యక్తులు బంధువులు, పక్కింటివారు, లేదా కుటుంబ సభ్యులే అయినా వెంటనే తల్లిదండ్రులకు తెలియజేయాలని బాలికలకు సూచించారు.

మహిళలు, బాలికల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు ఉన్నాయని, వారి భద్రత కోసం పోలీసులు 24 గంటలు పని చేస్తున్నారని తెలిపారు.

అలాగే రోడ్డు భద్రతపై మాట్లాడుతూ, పెట్రోల్ బంక్‌ల వద్ద హెల్మెట్ ధరించినవారికే ఇంధనం అందించాలని నిర్వాహకులు కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు. యువత మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

సత్యసాయి జిల్లాలో ప్రతిరోజూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో “అతివేగం కన్నా ప్రాణం మిన్న” అని అవగాహన కల్పించారు.

ఈ మేరకు పెనుకొండలో ఎస్‌ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ఎస్పీ సతీష్, ఆర్‌టీఓ కరుణసాగర్ రెడ్డి, డీఎస్పీ నరసింగప్ప, ఎంవీఐ స్వాతి, ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News