Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యుత్ తీగల సమస్యతో ఇబ్బందులు పడుతున్న కాలనీ వాసులు కెనరా బ్యాంకులో గోల్డ్ లోన్‌కు కొత్త షరతులు… వినియోగదారుల ఇబ్బందులు 131వ సవరణ: ప్రజాస్వామ్య బలోపేతమా? లేక కొత్త సవాళ్ల ఆరంభమా? ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 21, 2026 03:51 PM

పెనుకొండలో అవగాహన ర్యాలీ: బాలికల భద్రత, రోడ్డు నియమాలపై చైతన్యం

పెనుకొండలో అవగాహన ర్యాలీ: బాలికల భద్రత, రోడ్డు నియమాలపై చైతన్యం

పెనుకొండలో అవగాహన ర్యాలీ: బాలికల భద్రత, రోడ్డు నియమాలపై చైతన్యం
April 21, 2026 02:18 PM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Somandepalli
Prakash

పెనుకొండ: బాలికలపై జరిగే నేరాలను అరికట్టేందుకు పోక్సో చట్టంపై అవగాహన ప్రతి ఆడపిల్లకు తప్పనిసరిగా ఉండాలని అధికారులు సూచించారు. గుడ్ టచ్–బ్యాడ్ టచ్ గురించి స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. అనుచితంగా ప్రవర్తించే వ్యక్తులు బంధువులు, పక్కింటివారు, లేదా కుటుంబ సభ్యులే అయినా వెంటనే తల్లిదండ్రులకు తెలియజేయాలని బాలికలకు సూచించారు.

మహిళలు, బాలికల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు ఉన్నాయని, వారి భద్రత కోసం పోలీసులు 24 గంటలు పని చేస్తున్నారని తెలిపారు.

అలాగే రోడ్డు భద్రతపై మాట్లాడుతూ, పెట్రోల్ బంక్‌ల వద్ద హెల్మెట్ ధరించినవారికే ఇంధనం అందించాలని నిర్వాహకులు కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు. యువత మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

సత్యసాయి జిల్లాలో ప్రతిరోజూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో “అతివేగం కన్నా ప్రాణం మిన్న” అని అవగాహన కల్పించారు.

ఈ మేరకు పెనుకొండలో ఎస్‌ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ఎస్పీ సతీష్, ఆర్‌టీఓ కరుణసాగర్ రెడ్డి, డీఎస్పీ నరసింగప్ప, ఎంవీఐ స్వాతి, ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News