పెనుకొండలో అవగాహన ర్యాలీ: బాలికల భద్రత, రోడ్డు నియమాలపై చైతన్యం
పెనుకొండలో అవగాహన ర్యాలీ: బాలికల భద్రత, రోడ్డు నియమాలపై చైతన్యం
Prakash
పెనుకొండ: బాలికలపై జరిగే నేరాలను అరికట్టేందుకు పోక్సో చట్టంపై అవగాహన ప్రతి ఆడపిల్లకు తప్పనిసరిగా ఉండాలని అధికారులు సూచించారు. గుడ్ టచ్–బ్యాడ్ టచ్ గురించి స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. అనుచితంగా ప్రవర్తించే వ్యక్తులు బంధువులు, పక్కింటివారు, లేదా కుటుంబ సభ్యులే అయినా వెంటనే తల్లిదండ్రులకు తెలియజేయాలని బాలికలకు సూచించారు.
మహిళలు, బాలికల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు ఉన్నాయని, వారి భద్రత కోసం పోలీసులు 24 గంటలు పని చేస్తున్నారని తెలిపారు.
అలాగే రోడ్డు భద్రతపై మాట్లాడుతూ, పెట్రోల్ బంక్ల వద్ద హెల్మెట్ ధరించినవారికే ఇంధనం అందించాలని నిర్వాహకులు కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు. యువత మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
సత్యసాయి జిల్లాలో ప్రతిరోజూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో “అతివేగం కన్నా ప్రాణం మిన్న” అని అవగాహన కల్పించారు.
ఈ మేరకు పెనుకొండలో ఎస్ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ఎస్పీ సతీష్, ఆర్టీఓ కరుణసాగర్ రెడ్డి, డీఎస్పీ నరసింగప్ప, ఎంవీఐ స్వాతి, ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి