ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం పెనుగొలను సహకార సంఘంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ మహిళా నేతలైన సావిత్రిబాయి పూలే, సరోజినీ నాయుడు, ఇందిరాగాంధీ, చిత్రపటాలను పట్టుకుని మహిళలు ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా సాయిబాబా కమిటీ సభ్యులు వివిధ రంగాలలో సేవలందిస్తున్న మహిళలను శాలువాలు కప్పి సన్మానించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రాముఖ్యతను విశ్రాంత ఎం.ఈ.ఓ వి. శేషిరెడ్డి వివరించారు.
ఈ కార్యక్రమంలో సాయిబాబా కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావు, సహకార సంఘ కార్యదర్శి నామా నరసింహారావు, గ్రంథాలయ అధికారి తెనాలి వెంకటేశ్వరరావు, విశ్రాంత ప్రిన్సిపాల్ వెదురు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి