Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:31 AM

పెనుగొలనులో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

పెనుగొలనులో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

పెనుగొలనులో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
07-03-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం పెనుగొలను సహకార సంఘంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ మహిళా నేతలైన సావిత్రిబాయి పూలే, సరోజినీ నాయుడు, ఇందిరాగాంధీ, చిత్రపటాలను పట్టుకుని మహిళలు ప్రదర్శన నిర్వహించారు.

ఈ సందర్భంగా సాయిబాబా కమిటీ సభ్యులు వివిధ రంగాలలో సేవలందిస్తున్న మహిళలను శాలువాలు కప్పి సన్మానించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రాముఖ్యతను విశ్రాంత ఎం.ఈ.ఓ వి. శేషిరెడ్డి వివరించారు.

ఈ కార్యక్రమంలో సాయిబాబా కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావు, సహకార సంఘ కార్యదర్శి నామా నరసింహారావు, గ్రంథాలయ అధికారి తెనాలి వెంకటేశ్వరరావు, విశ్రాంత ప్రిన్సిపాల్ వెదురు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పెనుగొలనులో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

Article Image

ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం పెనుగొలను సహకార సంఘంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ మహిళా నేతలైన సావిత్రిబాయి పూలే, సరోజినీ నాయుడు, ఇందిరాగాంధీ, చిత్రపటాలను పట్టుకుని మహిళలు ప్రదర్శన నిర్వహించారు.

ఈ సందర్భంగా సాయిబాబా కమిటీ సభ్యులు వివిధ రంగాలలో సేవలందిస్తున్న మహిళలను శాలువాలు కప్పి సన్మానించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రాముఖ్యతను విశ్రాంత ఎం.ఈ.ఓ వి. శేషిరెడ్డి వివరించారు.

ఈ కార్యక్రమంలో సాయిబాబా కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావు, సహకార సంఘ కార్యదర్శి నామా నరసింహారావు, గ్రంథాలయ అధికారి తెనాలి వెంకటేశ్వరరావు, విశ్రాంత ప్రిన్సిపాల్ వెదురు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News