Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 07, 2026 07:33 PM

పెనుగొలనులో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

పెనుగొలనులో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

పెనుగొలనులో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
March 07, 2026 06:00 PM 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం పెనుగొలను సహకార సంఘంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ మహిళా నేతలైన సావిత్రిబాయి పూలే, సరోజినీ నాయుడు, ఇందిరాగాంధీ, చిత్రపటాలను పట్టుకుని మహిళలు ప్రదర్శన నిర్వహించారు.

ఈ సందర్భంగా సాయిబాబా కమిటీ సభ్యులు వివిధ రంగాలలో సేవలందిస్తున్న మహిళలను శాలువాలు కప్పి సన్మానించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రాముఖ్యతను విశ్రాంత ఎం.ఈ.ఓ వి. శేషిరెడ్డి వివరించారు.

ఈ కార్యక్రమంలో సాయిబాబా కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావు, సహకార సంఘ కార్యదర్శి నామా నరసింహారావు, గ్రంథాలయ అధికారి తెనాలి వెంకటేశ్వరరావు, విశ్రాంత ప్రిన్సిపాల్ వెదురు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News