Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామలింగేశ్వర ఆలయంలో నవగ్రహ మండప శంకుస్థాపన కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 25, 2026 04:57 AM

పెన్షనర్ల సామాజిక సేవ అభినందనీయం......

పెన్షనర్ల సామాజిక సేవ అభినందనీయం......

పెన్షనర్ల సామాజిక సేవ అభినందనీయం......
March 07, 2026 11:35 PM 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

వైద్యం వ్యాపారం లా కాకుండా సేవా దృక్పథంతో చూడాలి.....

పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం విజయవంతం......

సమాజానికి తమ వంతుగా సేవ చేయాలనే తపనతో కోదాడ ప్రాంత ప్రజలకు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని కోదాడ పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ జాస్తి సుబ్బారావు అన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో కోదాడ యూనిట్ అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన యశోద హాస్పిటల్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య స్థానిక 19వ వార్డు కౌన్సిలర్ కోటిరెడ్డిలతో కలిసి వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో విద్య, వైద్యం వ్యాపారంలా మారి సామాన్యుడికి అందుబాటులో లేని ఈ రోజుల్లో కార్పొరేట్ వైద్యులచే వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి కోదాడ ప్రాంత ప్రజలకు సేవ చేయడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు.వైద్యో నారాయణో హరి వైద్యాన్ని వ్యాపారంలా కాకుండా సేవా దృక్పథంతో చూడాలన్నారు. కాగా ఈ హెల్త్ క్యాంప్‌లో సుమారు 300 మంది రోగులు పాల్గొని తమ ఆరోగ్య సమస్యలపై వైద్యులను సంప్రదించారు.

ఈ సందర్భంగా వైద్యులు అభిషేక్ బార్లీ, కార్తీక్ కృష్ణ,అనిల్ చంద్ర, వల్ల రాకేష్ రెడ్డి వైద్య బృందం సభ్యులను శాలువా, మెమొంటాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోదాడ యూనిట్ అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బొల్లు రాంబాబు, కోదాడ యూనిట్ కార్యదర్శి రఘువర ప్రసాద్, జానయ్య ఎస్ దాని భ్రమరాంబా బిక్షం వెంకటరెడ్డి, శంబయ్య, రవీంద్రనాథ్ ఠాగూర్ విద్యాసాగర్, జగన్మోహన్ రావు,బాలేమియా, గురవయ్య, సత్యనారాయణ, నర్సిరెడ్డి, లక్ష్మీ నరసయ్య, హాసన్ జానీ, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు......

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News