పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ భాస్కర్ రావు
పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ భాస్కర్ రావు
Editor Desk
యాదాద్రి భువనగిరి జిల్లాలోని అన్ని పురపాలక సంఘాల పనుల పురోగతిపై అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎ. భాస్కర్ రావు, IAS శుక్రవారం మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ UIDF, TUFIDC, అమృత్ పథకం, స్వచ్ఛ భారత్ తదితర అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించి, పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందుకు సంబంధిత కాంట్రాక్టర్లతో సమావేశాలు నిర్వహించి, పనులను నిర్ణీత గడువులో నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని సూచించారు.
వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఏ మున్సిపాలిటీలోనూ నీటి ఎద్దడి లేకుండా ప్రజలకు సమృద్ధిగా తాగునీరు అందేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పట్టణాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి, చెత్త కుప్పలు లేకుండా ప్రతిరోజూ శుభ్రత పనులు నిర్వహించాలని ఆదేశించారు.
ఆస్తిపన్ను వసూళ్లలో 5 శాతం రాయితీపై ప్రజలకు అవగాహన కల్పించి, పన్నుల వసూళ్లను నూటికి నూరు శాతం సాధించేందుకు కృషి చేయాలని కమిషనర్లను ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లాలోని అన్ని మున్సిపల్ కమిషనర్లు, పబ్లిక్ హెల్త్ డీఈఈ , ఏఈ లు, సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి