Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మద్యానికి చెక్… నీర్నములలో సంచలన నిర్ణయం సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి “500 గర్భిణులను బైక్‌లో రక్షించిన ప్రాణదాత: ఛత్తీస్‌గఢ్ ‘బైక్ హీరో’ సురేష్ బెల్సారే” “మండల మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో ఆర్టీసీకి అద్దె బస్సులు… మహిళల ఆర్థిక సాధికారతకు కొత్త దిశ : సి‌ఎం రేవంత్” చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 03, 2026 09:29 PM

పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ భాస్కర్ రావు
April 03, 2026 07:20 PM 17 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లాలోని అన్ని పురపాలక సంఘాల పనుల పురోగతిపై అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎ. భాస్కర్ రావు, IAS శుక్రవారం మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ UIDF, TUFIDC, అమృత్ పథకం, స్వచ్ఛ భారత్ తదితర అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించి, పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందుకు సంబంధిత కాంట్రాక్టర్లతో సమావేశాలు నిర్వహించి, పనులను నిర్ణీత గడువులో నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని సూచించారు.

వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఏ మున్సిపాలిటీలోనూ నీటి ఎద్దడి లేకుండా ప్రజలకు సమృద్ధిగా తాగునీరు అందేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పట్టణాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి, చెత్త కుప్పలు లేకుండా ప్రతిరోజూ శుభ్రత పనులు నిర్వహించాలని ఆదేశించారు.

ఆస్తిపన్ను వసూళ్లలో 5 శాతం రాయితీపై ప్రజలకు అవగాహన కల్పించి, పన్నుల వసూళ్లను నూటికి నూరు శాతం సాధించేందుకు కృషి చేయాలని కమిషనర్లను ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లాలోని అన్ని మున్సిపల్ కమిషనర్లు, పబ్లిక్ హెల్త్ డీఈఈ , ఏఈ లు, సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News