Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:28 PM

పేదలకు భరోసా ముఖ్యమంత్రి సహాయ నిధి ఎమ్మెల్యే వేముల వీరేశం

పేదలకు భరోసా ముఖ్యమంత్రి సహాయ నిధి ఎమ్మెల్యే వేముల వీరేశం

పేదలకు భరోసా ముఖ్యమంత్రి సహాయ నిధి ఎమ్మెల్యే వేముల వీరేశం
January 22, 2026 03:21 PM 82 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

నకిరేకల్ నియోజకవర్గంలోని పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) పెద్ద భరోసాగా నిలుస్తోందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. గురువారం నాడు నకిరేకల్ పట్టణంలోని సాయిబాబా ఆలయ మందిరంలో నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలకు చెందిన 212 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.90 లక్షల 87 వేల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో ఇప్పటివరకు నకిరేకల్ నియోజకవర్గంలో రూ.18 కోట్ల 24 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు. వైద్య చికిత్సల కోసం పేదలకు ఈ నిధి ఎంతో ఉపయోగపడుతోందన్నారు.

త్వరలో నకిరేకల్‌లో నిర్మించిన 100 పడకల ఆసుపత్రిని ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. అలాగే ట్రామా కేర్ సెంటర్, సిటీ స్కాన్ వంటి వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల సమస్యలపై దృష్టి పెట్టి పనిచేస్తోందని అన్నారు. రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో రూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారని విమర్శించారు.

నియోజకవర్గంలో ఇప్పటివరకు 3,500 ఇళ్లను కేటాయించామని, మార్చి నెలలో మరో 3,500 ఇళ్లను పంపిణీ చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందుకున్న ప్రతి లబ్ధిదారుడికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత, నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ చెవుగోని రజిత–శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్లు గుత్తా మంజుల–మాధవ్ రెడ్డి, నర్రా వినోద–మోహన్ రెడ్డి, మండలాల అధ్యక్షులు, కౌన్సిలర్లు, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News