Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా బుక్ రివ్యూ కార్యక్రమం కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 09:05 AM

పెద్దకాపర్తి జెడ్పీహెచ్‌ఎస్‌కు క్యూరియా ఫార్మా చేయూత – సైన్స్ ల్యాబ్ ఫర్నిచర్ విరాళం

పెద్దకాపర్తి జెడ్పీహెచ్‌ఎస్‌కు క్యూరియా ఫార్మా చేయూత – సైన్స్ ల్యాబ్ ఫర్నిచర్ విరాళం

పెద్దకాపర్తి జెడ్పీహెచ్‌ఎస్‌కు క్యూరియా ఫార్మా చేయూత – సైన్స్ ల్యాబ్ ఫర్నిచర్ విరాళం
March 06, 2026 07:02 PM 76 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థి చొరవతో క్యూరియా ఫార్మా సంస్థచేయూతనందించింది. పాఠశాలకు రూ.2.20 లక్షల విలువైన సైన్స్ ల్యాబ్ ఫర్నిచర్‌ను అందించిన సంస్థ ప్రతినిధులను శుక్రవారం పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించింది.పాఠశాల ప్రధానోపాధ్యాయులు పీఠం శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో క్యూరియా ఫార్మా కంపెనీ హైదరాబాద్ సైట్ హెడ్ మురళీకృష్ణ, హెచ్‌ఆర్ హెడ్ చిక్కాల వెంకట్, సీనియర్ హెచ్‌ఆర్ బోనగిరి జ్యోతి, సౌమిత్రలకు పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించారు.

గత నెలలో గ్రామానికి చెందిన పాఠశాల పూర్వ విద్యార్థి ఆవుల రాఘవేందర్ సూచన మేరకు ఈ సాయం అందినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన క్యూరియా పరిశ్రమలో పరిశోధనాత్మక శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఆయన చొరవతో పాఠశాలలో సైన్స్ ల్యాబ్ అభివృద్ధికి అవసరమైన ఫర్నిచర్‌ను సంస్థ బహూకరించింది.ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సంస్థ ఎల్లప్పుడూ సహకరిస్తుందని చెప్పారు. విద్యార్థులు మెరుగైన సదుపాయాలతో చదువుకొని ఉన్నతస్థానాలనుఅధిరోహించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఆవుల జానయ్య, ఆవుల రాము, తాటి చంద్రమౌళి, గుండెబోయిన నరసింహ, గుజరి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News