Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 03:53 AM

పేద వృద్ధురాలి అంతక్రియలకు చేయూతనిచ్చిన మానవసేవే మాధవసేవ గ్రూప్ సభ్యులు

పేద వృద్ధురాలి అంతక్రియలకు చేయూతనిచ్చిన మానవసేవే మాధవసేవ గ్రూప్ సభ్యులు

పేద వృద్ధురాలి అంతక్రియలకు చేయూతనిచ్చిన మానవసేవే మాధవసేవ గ్రూప్ సభ్యులు
24-01-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

స్థానికం ప్రతినిధి మల్కాజ్గిరి పి ప్రభాకర్

మల్కాజిగిరి నియోజకవర్గం, గౌతమ్‌నగర్ డివిజన్ పరిధిలోని మీర్జాలగూడలో నివసిస్తున్న 70 సంవత్సరాల వృద్ధురాలు యాదమ్మ అనారోగ్యంతో శుక్రవారం పరమపదించారు. ఆమెకు ఎవరు  లేకపోవడంతో అంతక్రియలు నిర్వహించడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది.

ఈ విషయం మీర్జాలగూడ కాలనీకి చెందిన బిక్షపతి మానవసేవే మాధవసేవ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ కుమ్మరి రాజు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన కుమ్మరి రాజు వృద్ధురాలి పరిస్థితిని గ్రూప్‌లో తెలియజేశారు. మానవతా దృక్పథంతో స్పందించిన గ్రూప్ సభ్యులు తమ వంతు సహకారం అందించారు.

మొత్తం 19 మంది గ్రూప్ సభ్యుల సహకారంతో రూ.10,305/-లు సేకరించి, యాదమ్మ అంతక్రియల ఖర్చుల నిమిత్తం కాలనీ వాసుడు బిక్షపతికి గ్రూప్ అడ్మిన్ కుమ్మరి రాజు అందజేశారు.

సకాలంలో స్పందించి, పేద వృద్ధురాలి అంతక్రియలకు ఆర్థిక సహాయం అందించిన మానవసేవే మాధవసేవ వాట్సాప్ గ్రూప్ సభ్యులందరికీ కాలనీ వాసులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

పేద వృద్ధురాలి అంతక్రియలకు చేయూతనిచ్చిన మానవసేవే మాధవసేవ గ్రూప్ సభ్యులు

Article Image

స్థానికం ప్రతినిధి మల్కాజ్గిరి పి ప్రభాకర్

మల్కాజిగిరి నియోజకవర్గం, గౌతమ్‌నగర్ డివిజన్ పరిధిలోని మీర్జాలగూడలో నివసిస్తున్న 70 సంవత్సరాల వృద్ధురాలు యాదమ్మ అనారోగ్యంతో శుక్రవారం పరమపదించారు. ఆమెకు ఎవరు  లేకపోవడంతో అంతక్రియలు నిర్వహించడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది.

ఈ విషయం మీర్జాలగూడ కాలనీకి చెందిన బిక్షపతి మానవసేవే మాధవసేవ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ కుమ్మరి రాజు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన కుమ్మరి రాజు వృద్ధురాలి పరిస్థితిని గ్రూప్‌లో తెలియజేశారు. మానవతా దృక్పథంతో స్పందించిన గ్రూప్ సభ్యులు తమ వంతు సహకారం అందించారు.

మొత్తం 19 మంది గ్రూప్ సభ్యుల సహకారంతో రూ.10,305/-లు సేకరించి, యాదమ్మ అంతక్రియల ఖర్చుల నిమిత్తం కాలనీ వాసుడు బిక్షపతికి గ్రూప్ అడ్మిన్ కుమ్మరి రాజు అందజేశారు.

సకాలంలో స్పందించి, పేద వృద్ధురాలి అంతక్రియలకు ఆర్థిక సహాయం అందించిన మానవసేవే మాధవసేవ వాట్సాప్ గ్రూప్ సభ్యులందరికీ కాలనీ వాసులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News