Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:18 PM

పేద విద్యార్థులకు ఉచితంగా న్యాయవిద్య అందిస్తున్నాం.. లా కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం. మానస

పేద విద్యార్థులకు ఉచితంగా న్యాయవిద్య అందిస్తున్నాం.. లా కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం. మానస

పేద విద్యార్థులకు ఉచితంగా న్యాయవిద్య అందిస్తున్నాం.. లా కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం. మానస
02-04-2026 88 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పేద విద్యార్థులు అన్ని రంగాలలో రాణిస్తున్నట్లుగానే స్వశక్తితో ఎదగడానికి న్యాయవిద్య దోహదపడుతుందని సాంఘిక సంక్షేమ గురుకుల న్యాయ మహిళా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం. మానస తెలిపారు. గురువారం చైతన్యపురిలోని కళాశాలలో ఆమె మాట్లాడారు. 2020లో స్థాపించబడిన తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ మహిళా న్యాయ కళాశాల, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిందని పేర్కొన్నారు. భారతదేశంలోని మొట్టమొదటి రెసిడెన్షియల్ మహిళా న్యాయ కళాశాల ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాచే ఆమోదించబడిన మా కళాశాలలో తెలంగాణ లా సెట్ ర్యాంకుల ఆధారంగా ఎస్సీ విద్యార్థులకు 75% రిజర్వేషన్‌తో 120 సీట్ల ప్రవేశం కల్పిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న మా కళాశాల అద్భుతమైన మౌలిక సదుపాయాలను అత్యంత అర్హత కలిగిన అధ్యాపక బృందాన్ని కలిగి ఉందని గ్రామీణ వెనుకబడిన తరగతి విద్యార్థులకు ఇంటర్మీడియట్ పూర్తిచేసిన మహిళా విద్యార్థులకు నాణ్యమైన ఉచిత న్యాయవిద్యను అందిస్తున్నట్లు తెలిపారు. మా 2025 బ్యాచ్ అద్భుతమైన విజయాన్ని సాధించిందని ఇందులో 32 మంది విద్యార్థులు ఎల్ ఎల్ ఎం సీట్లు సాధించారని వివరించారు. వీరిలో ఇద్దరు ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా లో సీటు పొందారని మా పూర్వ విద్యార్థులు న్యాయవాదులుగా, విద్యావేత్తలుగా, నాయకులుగా రాణించారన్నారు. వీరిలో 13 మంది బహుళజాతి కంపెనీలలో పనిచేస్తుండగా 15 మంది హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారని మరికొందరు సమాజానికి గణనీయమైన సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. మూట్ కోర్టులు, మాక్ పార్లమెంట్ వంటి సహ-పాఠ్య అదనపు-పాఠ్య కార్యకలాపాల ద్వారా మేము సంపూర్ణ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ చర్చలు, క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలు సామాజిక న్యాయానికి దేశ నిర్మాణానికి కట్టుబడి ఉండే క్రమశిక్షణ, గౌరవం, బాధ్యత గల పౌరులను, న్యాయవాదులను తీర్చిదిద్దడమే మా లక్ష్యమన్నారు. న్యాయవిద్య అభ్యసించాలంటే ప్రైవేట్ కళాశాలలో లక్షలలో ఫీజులు ఉంటాయని అవేవీ లేకుండా తాము ఉచితంగా న్యాయ విద్య అందజేస్తున్నట్లు తెలిపారు.

Sthanikam

పేద విద్యార్థులకు ఉచితంగా న్యాయవిద్య అందిస్తున్నాం.. లా కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం. మానస

Article Image

పేద విద్యార్థులు అన్ని రంగాలలో రాణిస్తున్నట్లుగానే స్వశక్తితో ఎదగడానికి న్యాయవిద్య దోహదపడుతుందని సాంఘిక సంక్షేమ గురుకుల న్యాయ మహిళా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం. మానస తెలిపారు. గురువారం చైతన్యపురిలోని కళాశాలలో ఆమె మాట్లాడారు. 2020లో స్థాపించబడిన తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ మహిళా న్యాయ కళాశాల, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిందని పేర్కొన్నారు. భారతదేశంలోని మొట్టమొదటి రెసిడెన్షియల్ మహిళా న్యాయ కళాశాల ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాచే ఆమోదించబడిన మా కళాశాలలో తెలంగాణ లా సెట్ ర్యాంకుల ఆధారంగా ఎస్సీ విద్యార్థులకు 75% రిజర్వేషన్‌తో 120 సీట్ల ప్రవేశం కల్పిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న మా కళాశాల అద్భుతమైన మౌలిక సదుపాయాలను అత్యంత అర్హత కలిగిన అధ్యాపక బృందాన్ని కలిగి ఉందని గ్రామీణ వెనుకబడిన తరగతి విద్యార్థులకు ఇంటర్మీడియట్ పూర్తిచేసిన మహిళా విద్యార్థులకు నాణ్యమైన ఉచిత న్యాయవిద్యను అందిస్తున్నట్లు తెలిపారు. మా 2025 బ్యాచ్ అద్భుతమైన విజయాన్ని సాధించిందని ఇందులో 32 మంది విద్యార్థులు ఎల్ ఎల్ ఎం సీట్లు సాధించారని వివరించారు. వీరిలో ఇద్దరు ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా లో సీటు పొందారని మా పూర్వ విద్యార్థులు న్యాయవాదులుగా, విద్యావేత్తలుగా, నాయకులుగా రాణించారన్నారు. వీరిలో 13 మంది బహుళజాతి కంపెనీలలో పనిచేస్తుండగా 15 మంది హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారని మరికొందరు సమాజానికి గణనీయమైన సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. మూట్ కోర్టులు, మాక్ పార్లమెంట్ వంటి సహ-పాఠ్య అదనపు-పాఠ్య కార్యకలాపాల ద్వారా మేము సంపూర్ణ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ చర్చలు, క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలు సామాజిక న్యాయానికి దేశ నిర్మాణానికి కట్టుబడి ఉండే క్రమశిక్షణ, గౌరవం, బాధ్యత గల పౌరులను, న్యాయవాదులను తీర్చిదిద్దడమే మా లక్ష్యమన్నారు. న్యాయవిద్య అభ్యసించాలంటే ప్రైవేట్ కళాశాలలో లక్షలలో ఫీజులు ఉంటాయని అవేవీ లేకుండా తాము ఉచితంగా న్యాయ విద్య అందజేస్తున్నట్లు తెలిపారు.

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News