Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అదాని సిమెంట్ పనులు నిలిపివేయాలని కలెక్టర్‌కు వినతి బిడ్డను ఒడిలో, మందుల పెట్టె చేతిలో… నది దాటి టీకాలు ఇస్తున్న మంతి కుమారి “మండల మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో ఆర్టీసీకి అద్దె బస్సులు… మహిళల ఆర్థిక సాధికారతకు కొత్త దిశ : సి‌ఎం రేవంత్” చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 02, 2026 06:34 PM

పేద విద్యార్థులకు ఉచితంగా న్యాయవిద్య అందిస్తున్నాం.. లా కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం. మానస

పేద విద్యార్థులకు ఉచితంగా న్యాయవిద్య అందిస్తున్నాం.. లా కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం. మానస

పేద విద్యార్థులకు ఉచితంగా న్యాయవిద్య అందిస్తున్నాం.. లా కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం. మానస
April 02, 2026 04:10 PM 24 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పేద విద్యార్థులు అన్ని రంగాలలో రాణిస్తున్నట్లుగానే స్వశక్తితో ఎదగడానికి న్యాయవిద్య దోహదపడుతుందని సాంఘిక సంక్షేమ గురుకుల న్యాయ మహిళా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం. మానస తెలిపారు. గురువారం చైతన్యపురిలోని కళాశాలలో ఆమె మాట్లాడారు. 2020లో స్థాపించబడిన తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ మహిళా న్యాయ కళాశాల, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిందని పేర్కొన్నారు. భారతదేశంలోని మొట్టమొదటి రెసిడెన్షియల్ మహిళా న్యాయ కళాశాల ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాచే ఆమోదించబడిన మా కళాశాలలో తెలంగాణ లా సెట్ ర్యాంకుల ఆధారంగా ఎస్సీ విద్యార్థులకు 75% రిజర్వేషన్‌తో 120 సీట్ల ప్రవేశం కల్పిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న మా కళాశాల అద్భుతమైన మౌలిక సదుపాయాలను అత్యంత అర్హత కలిగిన అధ్యాపక బృందాన్ని కలిగి ఉందని గ్రామీణ వెనుకబడిన తరగతి విద్యార్థులకు ఇంటర్మీడియట్ పూర్తిచేసిన మహిళా విద్యార్థులకు నాణ్యమైన ఉచిత న్యాయవిద్యను అందిస్తున్నట్లు తెలిపారు. మా 2025 బ్యాచ్ అద్భుతమైన విజయాన్ని సాధించిందని ఇందులో 32 మంది విద్యార్థులు ఎల్ ఎల్ ఎం సీట్లు సాధించారని వివరించారు. వీరిలో ఇద్దరు ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా లో సీటు పొందారని మా పూర్వ విద్యార్థులు న్యాయవాదులుగా, విద్యావేత్తలుగా, నాయకులుగా రాణించారన్నారు. వీరిలో 13 మంది బహుళజాతి కంపెనీలలో పనిచేస్తుండగా 15 మంది హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారని మరికొందరు సమాజానికి గణనీయమైన సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. మూట్ కోర్టులు, మాక్ పార్లమెంట్ వంటి సహ-పాఠ్య అదనపు-పాఠ్య కార్యకలాపాల ద్వారా మేము సంపూర్ణ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ చర్చలు, క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలు సామాజిక న్యాయానికి దేశ నిర్మాణానికి కట్టుబడి ఉండే క్రమశిక్షణ, గౌరవం, బాధ్యత గల పౌరులను, న్యాయవాదులను తీర్చిదిద్దడమే మా లక్ష్యమన్నారు. న్యాయవిద్య అభ్యసించాలంటే ప్రైవేట్ కళాశాలలో లక్షలలో ఫీజులు ఉంటాయని అవేవీ లేకుండా తాము ఉచితంగా న్యాయ విద్య అందజేస్తున్నట్లు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News