Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదాల నివారణలో అధికారులు బాధ్యతగా పనిచేయాలి: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 31, 2026 03:16 AM

పీఆర్టీయూ ఆధ్వర్యంలో అవార్డుల ప్రదానోత్సవం. విద్యార్థుల విజయాలు జిల్లాకు గర్వకారణం : మంత్రి వాకిటి శ్రీహరి

పీఆర్టీయూ ఆధ్వర్యంలో అవార్డుల ప్రదానోత్సవం. విద్యార్థుల విజయాలు జిల్లాకు గర్వకారణం : మంత్రి వాకిటి శ్రీహరి

పీఆర్టీయూ ఆధ్వర్యంలో అవార్డుల ప్రదానోత్సవం.  విద్యార్థుల విజయాలు జిల్లాకు గర్వకారణం : మంత్రి వాకిటి శ్రీహరి
May 29, 2026 06:00 PM 21 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పదో తరగతి ప్రతిభావంతుల విద్యార్థులకు ఘన సన్మానం

:పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని అంజనా గార్డెన్‌లో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులను సన్మానించి అవార్డులు ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమానికి మంత్రి వాకిటి శ్రీహరి, జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక, భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రాజ్‌కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందిస్తూ మెమొంటోలు, ప్రశంసాపత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరచడం ఆనందంగా ఉందన్నారు. జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక మాట్లాడుతూ విద్యార్థుల విజయంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల పాత్ర కీలకమని పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం నాయకులు జనార్దన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రఘువీర్, జేఎల్ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News