Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:20 PM

పీఆర్సీ, ఓపీఎస్ డిమాండ్‌తో అంబేద్కర్ యూనివర్సిటీలో నిరసన

పీఆర్సీ, ఓపీఎస్ డిమాండ్‌తో అంబేద్కర్ యూనివర్సిటీలో నిరసన

పీఆర్సీ, ఓపీఎస్ డిమాండ్‌తో అంబేద్కర్ యూనివర్సిటీలో నిరసన
17-04-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్,

పీఆర్సీ అమలు, పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) పునరుద్ధరణతో పాటు ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉద్యోగులు శుక్రవారం నిరసన చేపట్టారు.

తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు విశ్వవిద్యాలయంలో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళనలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సంఘాల నాయకులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో పరిపాలన భవనం ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి తమ డిమాండ్లను వ్యక్తం చేశారు.

పీఆర్సీని తక్షణమే అమలు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని, ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులకు క్యాష్‌లెస్ హెల్త్ కార్డులు జారీ చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆందోళనకారులు ఆరోపించారు. సమస్యలు పరిష్కారం కాకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘం అధ్యక్షుడు కాంతం ప్రేమ్ కుమార్, విశ్వనాథ్, మియాజాని, పాండు, అశోక్, భరత్ రెడ్డి, డా. యకేష్ దైదా, సుహాసిని, భూలక్ష్మి, నాగలత, తిరుపతమ్మ, జ్యోతీ శ్రీ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పీఆర్సీ, ఓపీఎస్ డిమాండ్‌తో అంబేద్కర్ యూనివర్సిటీలో నిరసన

Article Image

హైదరాబాద్,

పీఆర్సీ అమలు, పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) పునరుద్ధరణతో పాటు ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉద్యోగులు శుక్రవారం నిరసన చేపట్టారు.

తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు విశ్వవిద్యాలయంలో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళనలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సంఘాల నాయకులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో పరిపాలన భవనం ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి తమ డిమాండ్లను వ్యక్తం చేశారు.

పీఆర్సీని తక్షణమే అమలు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని, ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులకు క్యాష్‌లెస్ హెల్త్ కార్డులు జారీ చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆందోళనకారులు ఆరోపించారు. సమస్యలు పరిష్కారం కాకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘం అధ్యక్షుడు కాంతం ప్రేమ్ కుమార్, విశ్వనాథ్, మియాజాని, పాండు, అశోక్, భరత్ రెడ్డి, డా. యకేష్ దైదా, సుహాసిని, భూలక్ష్మి, నాగలత, తిరుపతమ్మ, జ్యోతీ శ్రీ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News