పీఆర్సీ, ఓపీఎస్ డిమాండ్తో అంబేద్కర్ యూనివర్సిటీలో నిరసన
పీఆర్సీ, ఓపీఎస్ డిమాండ్తో అంబేద్కర్ యూనివర్సిటీలో నిరసన
Editor Desk
హైదరాబాద్,
పీఆర్సీ అమలు, పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) పునరుద్ధరణతో పాటు ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉద్యోగులు శుక్రవారం నిరసన చేపట్టారు.
తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు విశ్వవిద్యాలయంలో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళనలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సంఘాల నాయకులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో పరిపాలన భవనం ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి తమ డిమాండ్లను వ్యక్తం చేశారు.
పీఆర్సీని తక్షణమే అమలు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని, ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ హెల్త్ కార్డులు జారీ చేయాలని, పెండింగ్లో ఉన్న ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆందోళనకారులు ఆరోపించారు. సమస్యలు పరిష్కారం కాకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘం అధ్యక్షుడు కాంతం ప్రేమ్ కుమార్, విశ్వనాథ్, మియాజాని, పాండు, అశోక్, భరత్ రెడ్డి, డా. యకేష్ దైదా, సుహాసిని, భూలక్ష్మి, నాగలత, తిరుపతమ్మ, జ్యోతీ శ్రీ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి