Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 04:58 AM

పీ4 కార్యక్రమంలో సేవలకు గుర్తింపు – మంత్రి సవిత సన్మానం

పీ4 కార్యక్రమంలో సేవలకు గుర్తింపు – మంత్రి సవిత సన్మానం

పీ4 కార్యక్రమంలో సేవలకు గుర్తింపు – మంత్రి సవిత సన్మానం
20-04-2026 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పెనుకొండ: నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడిన పీ4 కార్యక్రమం కింద మార్గదర్శకులు, ఉత్తమ సేవలు అందించిన పలువురిని మంత్రి సవిత సన్మానించారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజా సేవలో ముందుండి పనిచేసిన వారిని ఆమె అభినందించారు.

రోడ్డు నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసిన కాంట్రాక్టర్లను ప్రత్యేకంగా సత్కరించిన మంత్రి, నాణ్యతతో పాటు సమయపాలనకు ప్రాధాన్యం ఇవ్వడం అభినందనీయమని తెలిపారు. స్థానిక నాయకుల సేవలు, ప్రజలతో వారి అనుసంధానం అభివృద్ధికి దోహదపడుతున్నాయని పేర్కొన్నారు.

అదేవిధంగా పలు శాఖల అధికారులను కూడా సన్మానిస్తూ, వారి సమర్థవంతమైన పనితీరుతోనే అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతమవుతున్నాయని మంత్రి సవిత అన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే ఉత్సాహంతో పనిచేయాలని కార్యక్రమంలో పాల్గొన్న వారిని ఆమె ఆకాంక్షించారు.


Sthanikam

పీ4 కార్యక్రమంలో సేవలకు గుర్తింపు – మంత్రి సవిత సన్మానం

Article Image

పెనుకొండ: నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడిన పీ4 కార్యక్రమం కింద మార్గదర్శకులు, ఉత్తమ సేవలు అందించిన పలువురిని మంత్రి సవిత సన్మానించారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజా సేవలో ముందుండి పనిచేసిన వారిని ఆమె అభినందించారు.

రోడ్డు నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసిన కాంట్రాక్టర్లను ప్రత్యేకంగా సత్కరించిన మంత్రి, నాణ్యతతో పాటు సమయపాలనకు ప్రాధాన్యం ఇవ్వడం అభినందనీయమని తెలిపారు. స్థానిక నాయకుల సేవలు, ప్రజలతో వారి అనుసంధానం అభివృద్ధికి దోహదపడుతున్నాయని పేర్కొన్నారు.

అదేవిధంగా పలు శాఖల అధికారులను కూడా సన్మానిస్తూ, వారి సమర్థవంతమైన పనితీరుతోనే అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతమవుతున్నాయని మంత్రి సవిత అన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే ఉత్సాహంతో పనిచేయాలని కార్యక్రమంలో పాల్గొన్న వారిని ఆమె ఆకాంక్షించారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News