పెనుకొండ: నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడిన పీ4 కార్యక్రమం కింద మార్గదర్శకులు, ఉత్తమ సేవలు అందించిన పలువురిని మంత్రి సవిత సన్మానించారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజా సేవలో ముందుండి పనిచేసిన వారిని ఆమె అభినందించారు.
రోడ్డు నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసిన కాంట్రాక్టర్లను ప్రత్యేకంగా సత్కరించిన మంత్రి, నాణ్యతతో పాటు సమయపాలనకు ప్రాధాన్యం ఇవ్వడం అభినందనీయమని తెలిపారు. స్థానిక నాయకుల సేవలు, ప్రజలతో వారి అనుసంధానం అభివృద్ధికి దోహదపడుతున్నాయని పేర్కొన్నారు.
అదేవిధంగా పలు శాఖల అధికారులను కూడా సన్మానిస్తూ, వారి సమర్థవంతమైన పనితీరుతోనే అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతమవుతున్నాయని మంత్రి సవిత అన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే ఉత్సాహంతో పనిచేయాలని కార్యక్రమంలో పాల్గొన్న వారిని ఆమె ఆకాంక్షించారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి