Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లెక్కల మాస్టారైన జిల్లా కలెక్టర్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 04:58 AM

పీ4 కార్యక్రమంలో సేవలకు గుర్తింపు – మంత్రి సవిత సన్మానం

పీ4 కార్యక్రమంలో సేవలకు గుర్తింపు – మంత్రి సవిత సన్మానం

పీ4 కార్యక్రమంలో సేవలకు గుర్తింపు – మంత్రి సవిత సన్మానం
April 20, 2026 07:32 PM 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పెనుకొండ: నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడిన పీ4 కార్యక్రమం కింద మార్గదర్శకులు, ఉత్తమ సేవలు అందించిన పలువురిని మంత్రి సవిత సన్మానించారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజా సేవలో ముందుండి పనిచేసిన వారిని ఆమె అభినందించారు.

రోడ్డు నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసిన కాంట్రాక్టర్లను ప్రత్యేకంగా సత్కరించిన మంత్రి, నాణ్యతతో పాటు సమయపాలనకు ప్రాధాన్యం ఇవ్వడం అభినందనీయమని తెలిపారు. స్థానిక నాయకుల సేవలు, ప్రజలతో వారి అనుసంధానం అభివృద్ధికి దోహదపడుతున్నాయని పేర్కొన్నారు.

అదేవిధంగా పలు శాఖల అధికారులను కూడా సన్మానిస్తూ, వారి సమర్థవంతమైన పనితీరుతోనే అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతమవుతున్నాయని మంత్రి సవిత అన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే ఉత్సాహంతో పనిచేయాలని కార్యక్రమంలో పాల్గొన్న వారిని ఆమె ఆకాంక్షించారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News