Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడే మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష కదం తొక్కిన గిల్.. కోల్‌కతాపై గుజరాత్‌ ఘన విజయం రైతు కుటుంబానికి అండగా రెడ్స్ సంస్థ ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 18, 2026 08:06 PM

పట్టణ సమస్యలపై సిపిఎం పోరుబాట.

పట్టణ సమస్యలపై సిపిఎం పోరుబాట.

పట్టణ సమస్యలపై సిపిఎం పోరుబాట.
April 18, 2026 06:14 PM 16 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: పట్టణంలో పేరుకే అభివృద్ధి జరుగుతుందని, వాస్తవానికి ప్రజలు తీవ్రమైన సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం నాయకులు మండిపడ్డారు. సిపిఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా శనివారం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సమస్యలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య మాట్లాడుతూ… పారిశుద్ధ్యంపై పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. మురికికాలువలు సక్రమంగా శుభ్రం చేయకపోవడంతో దోమలు, ఈగలు, పందులు విస్తరిస్తున్నాయని, ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు.

పాత సీసీ రోడ్లు ధ్వంసమై ప్రమాదాలకు దారి తీస్తున్నాయని, హరిజనవాడ–అలీసాబ్‌గుట్ట ప్రధాన నీటి పైపులైన్ లీకేజీ కారణంగా దుర్వాసన వ్యాపిస్తోందని చెప్పారు. గుంటల్లో పందులు చనిపోవడం వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

చేతిపంపుల మరమ్మతులు సగంలోనే వదిలేయడంతో నీటి సమస్య మరింత తీవ్రమైందని, ఎండాకాలం దృష్ట్యా వెంటనే మరమ్మతులు చేయాలని లేదా మోటార్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

పట్టణ సమస్యలపై పలుమార్లు గ్రామపంచాయతీకి వినతిపత్రాలు అందించినా స్పందన లేదని, సమస్యలు పరిష్కరించకపోతే గ్రామపంచాయతీ, ఎంపీడీవో కార్యాలయాల ఎదుట ధర్నాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో కందుల హనుమంతు, గొరిగే సోములు, మునికుంట్ల లెనిన్, ఆముద ఆంజనేయులు, భావాండ్లపల్లి సత్యం, పల్లె సత్యం, రాసాల రమేష్, గొరిగే మల్లేశం, బండారు రాకేష్, మునికుంట్ల రాణి, సిద్ధమ్మ, పర్స అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News