పసునూరు లో శ్రీరామనవమి సందర్భంగా ట్రాక్టర్ పోటీలు
పసునూరు లో శ్రీరామనవమి సందర్భంగా ట్రాక్టర్ పోటీలు
Editor Desk
నాంపల్లి మండలం పసునూరు గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా ట్రాక్టర్ పోటీలు ఉత్సాహంగా నిర్వహించబడినాయి. గ్రామ యువకులు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని పోటీలను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ పెద్దలు ట్రాక్టర్ల యూనికాన్ యూనియన్ లో సంయుక్తంగా నిర్వహించినారు. ట్రాక్టర్ల శక్తి వేగం, డ్రైవింగ్ అయిపోయిందని ప్రదర్శించే విధంగా వివిధ రకాల పోటీలను ఏర్పాటు చేయగా ప్రేక్షకులు ఆసక్తిగా వీక్షించారు. పోటీలలో గెలుపొందిన వారికి నగదు బహుమతులు ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ రేగోజు నరసింహ చారి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇలాగే నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోగుల వెంకటరెడ్డి తండ్రి ఇస్తాపరెడ్డి, రాగి పని ధనంజయ చారి, వీరమళ్ళ సందీప్, కెసిఆర్, ఎస్కే ఖాదర్, ఇద్రిస్, ట్రాక్టర్ యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు














































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి