Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:20 PM

పసి హృదయాల పెద్ద మనసు.

పసి హృదయాల పెద్ద మనసు.

పసి హృదయాల పెద్ద మనసు.
18-04-2026 406 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్నేహితురాలి కుటుంబానికి విద్యార్థినుల ఆర్థిక సహాయం

బిబినగర్: చిన్న వయసులోనే పెద్ద మనసును చాటుకున్న గురుకుల విద్యార్థినుల ఉదారత అందరినీ కదిలించింది. మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల, బిబినగర్‌లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థినులు తమ సహ చదువరి మృతి నేపథ్యంలో మానవత్వాన్ని చాటుకున్నారు.

మునిపంపుల గ్రామానికి చెందిన మెడి లాస్య ఇటీవల మృతిచెందగా, ఈ విషాదంతో ఆమె కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. పరీక్షలు పూర్తయ్యిన అనంతరం లాస్యతో కలిసి చదువుకున్న సహ విద్యార్థినులు ఆమె ఇంటికి వెళ్లి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను పరామర్శించారు.

అంతటితో ఆగకుండా, తమ వంతుగా ఆర్థిక సహాయం సేకరించి బాధిత కుటుంబానికి అందజేశారు. చిన్న వయసులోనే ఇంతటి సహానుభూతి, మానవత్వం చూపిన విద్యార్థినుల చర్యను గ్రామస్థులు ప్రశంసించారు. ఈ ఉదారత సమాజానికి స్ఫూర్తిదాయకమని పలువురు అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో సుక్క వరలక్ష్మి, మేఘన, రేణు శ్రీ, భవ్య శ్రీ, ఇందు సహారా, అక్షయ, లక్ష్మీ ప్రసన్న, కీర్తి తులసి, శ్రీజ, భావన, యువదీప్తి, వింద్య, ప్రవళిక, తులసి, శరణ్య, దివ్య, నిహారిక, సమీరా, శివాని తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పసి హృదయాల పెద్ద మనసు.

Article Image

స్నేహితురాలి కుటుంబానికి విద్యార్థినుల ఆర్థిక సహాయం

బిబినగర్: చిన్న వయసులోనే పెద్ద మనసును చాటుకున్న గురుకుల విద్యార్థినుల ఉదారత అందరినీ కదిలించింది. మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల, బిబినగర్‌లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థినులు తమ సహ చదువరి మృతి నేపథ్యంలో మానవత్వాన్ని చాటుకున్నారు.

మునిపంపుల గ్రామానికి చెందిన మెడి లాస్య ఇటీవల మృతిచెందగా, ఈ విషాదంతో ఆమె కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. పరీక్షలు పూర్తయ్యిన అనంతరం లాస్యతో కలిసి చదువుకున్న సహ విద్యార్థినులు ఆమె ఇంటికి వెళ్లి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను పరామర్శించారు.

అంతటితో ఆగకుండా, తమ వంతుగా ఆర్థిక సహాయం సేకరించి బాధిత కుటుంబానికి అందజేశారు. చిన్న వయసులోనే ఇంతటి సహానుభూతి, మానవత్వం చూపిన విద్యార్థినుల చర్యను గ్రామస్థులు ప్రశంసించారు. ఈ ఉదారత సమాజానికి స్ఫూర్తిదాయకమని పలువురు అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో సుక్క వరలక్ష్మి, మేఘన, రేణు శ్రీ, భవ్య శ్రీ, ఇందు సహారా, అక్షయ, లక్ష్మీ ప్రసన్న, కీర్తి తులసి, శ్రీజ, భావన, యువదీప్తి, వింద్య, ప్రవళిక, తులసి, శరణ్య, దివ్య, నిహారిక, సమీరా, శివాని తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News