పసి హృదయాల పెద్ద మనసు.
పసి హృదయాల పెద్ద మనసు.
Editor Desk
స్నేహితురాలి కుటుంబానికి విద్యార్థినుల ఆర్థిక సహాయం
బిబినగర్: చిన్న వయసులోనే పెద్ద మనసును చాటుకున్న గురుకుల విద్యార్థినుల ఉదారత అందరినీ కదిలించింది. మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల, బిబినగర్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థినులు తమ సహ చదువరి మృతి నేపథ్యంలో మానవత్వాన్ని చాటుకున్నారు.
మునిపంపుల గ్రామానికి చెందిన మెడి లాస్య ఇటీవల మృతిచెందగా, ఈ విషాదంతో ఆమె కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. పరీక్షలు పూర్తయ్యిన అనంతరం లాస్యతో కలిసి చదువుకున్న సహ విద్యార్థినులు ఆమె ఇంటికి వెళ్లి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అంతటితో ఆగకుండా, తమ వంతుగా ఆర్థిక సహాయం సేకరించి బాధిత కుటుంబానికి అందజేశారు. చిన్న వయసులోనే ఇంతటి సహానుభూతి, మానవత్వం చూపిన విద్యార్థినుల చర్యను గ్రామస్థులు ప్రశంసించారు. ఈ ఉదారత సమాజానికి స్ఫూర్తిదాయకమని పలువురు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో సుక్క వరలక్ష్మి, మేఘన, రేణు శ్రీ, భవ్య శ్రీ, ఇందు సహారా, అక్షయ, లక్ష్మీ ప్రసన్న, కీర్తి తులసి, శ్రీజ, భావన, యువదీప్తి, వింద్య, ప్రవళిక, తులసి, శరణ్య, దివ్య, నిహారిక, సమీరా, శివాని తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి