పశు ఔషధ బ్యాంకుకు విరాళం .. !!
పశు ఔషధ బ్యాంకుకు విరాళం .. !!
Harish HS
కోదాడ పశు ఔషధ బ్యాంక్ నకి వరుసగా మూడవ నెల విరాళం
చలమల్ల వెంకట లక్ష్మారెడ్డి దానగుణం వెలకట్టలేనిది
డా. పి.పెంటయ్య, అసిస్టెంట్ డైరెక్టర్
ఎవరైనా దానగుణం తో ఒకసారి విరాళమిస్తారు, లేదంటే సంవత్సరానికోసారి ఇస్తారు. అదే పశువులకోసం అయితే ఇలాంటి దాతలు అత్యంత అరుదు. వీరు మాత్రం పశు ఆరోగ్య సేవే పరమావధిగా భావించి జనవరి నుండి ప్రతీ నెలా క్రమం తప్పకుండా నెలకి అయిదు వేల రూపాయల అత్యవసర పశు ఔషధాలను కోదాడ పశు ఔషధ బ్యాంక్ నకు అందజేయడం అత్యంత విశేషం.
వివరాల్లోకి వెళ్తే కోదాడ పట్టణంలో. నీటిపారుదల శాఖ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ మరియు సత్యసాయి సేవాట్రస్ట్ జిల్లా కమిటీ సభ్యులు చలమల్ల వెంకటలక్ష్మారెడ్డి మూగజీవాలపై అనిర్వచనీయమైన ప్రేమాభిమానాలతో పశు ఔషధ బ్యాంక్ నకు ఈ నెల కూడా పశు ఔషధాలను విరాళంగా అందించి జీవులపై ప్రేమాభిమానాలు పంచుతున్నారు .
గతం లో పశు ఔషధాలతో పాటు ఇంతవరకు ఎవ్వరూ అందించని విధంగా ఇండైరెక్ట్ ఆప్తాల్మోస్కోప్ సైతం అందించారు.
ఇచ్చిన మాట ప్రకారం మూగజీవాలకోసం, వాటియజమానులపై ఆర్ధికభారం తగ్గించి పశుపోషణ లాభసాటిగా మార్చడం కోసం తన వంతుగా నిరంతరం కొనసాగుతున్న చలమల్ల వెంకటలక్ష్మారెడ్డి దాతృత్వం వెలకట్టలేనిది అని అసిస్టెంట్ డైరెక్టర్ ప్రశంసించారు .
ఔషధపంపిణీ కార్యక్రమములో కోదాడ మండల పశువైద్యాధికారి డా. భూక్యా మధు, అనంతగిరి మండల పశువైద్యాధికారి డా . సిరిపురపు సురేంద్ర సిబ్బంది రాజు, చంద్రకళ , బాలచంద్ర పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి