Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మంత్రి సవితమ్మ చేతుల మీదుగా ప్రారంభోత్సవం.. చైర్మన్, డైరెక్టర్లకు సత్కారం కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 02:00 PM

పశు ఔషధ బ్యాంకుకు విరాళం .. !!

పశు ఔషధ బ్యాంకుకు విరాళం .. !!

పశు ఔషధ బ్యాంకుకు విరాళం .. !!
March 04, 2026 05:23 PM 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

కోదాడ పశు ఔషధ బ్యాంక్ నకి వరుసగా మూడవ నెల విరాళం

చలమల్ల వెంకట లక్ష్మారెడ్డి దానగుణం వెలకట్టలేనిది

డా. పి.పెంటయ్య, అసిస్టెంట్ డైరెక్టర్

ఎవరైనా దానగుణం తో ఒకసారి విరాళమిస్తారు, లేదంటే సంవత్సరానికోసారి ఇస్తారు. అదే పశువులకోసం అయితే ఇలాంటి దాతలు అత్యంత అరుదు. వీరు మాత్రం పశు ఆరోగ్య సేవే పరమావధిగా భావించి జనవరి నుండి ప్రతీ నెలా క్రమం తప్పకుండా నెలకి అయిదు వేల రూపాయల అత్యవసర పశు ఔషధాలను కోదాడ పశు ఔషధ బ్యాంక్ నకు అందజేయడం అత్యంత విశేషం.

వివరాల్లోకి వెళ్తే కోదాడ పట్టణంలో. నీటిపారుదల శాఖ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ మరియు సత్యసాయి సేవాట్రస్ట్ జిల్లా కమిటీ సభ్యులు చలమల్ల వెంకటలక్ష్మారెడ్డి మూగజీవాలపై అనిర్వచనీయమైన ప్రేమాభిమానాలతో పశు ఔషధ బ్యాంక్ నకు ఈ నెల కూడా పశు ఔషధాలను విరాళంగా అందించి జీవులపై ప్రేమాభిమానాలు పంచుతున్నారు .

గతం లో పశు ఔషధాలతో పాటు ఇంతవరకు ఎవ్వరూ అందించని విధంగా ఇండైరెక్ట్ ఆప్తాల్మోస్కోప్ సైతం అందించారు.

ఇచ్చిన మాట ప్రకారం మూగజీవాలకోసం, వాటియజమానులపై ఆర్ధికభారం తగ్గించి పశుపోషణ లాభసాటిగా మార్చడం కోసం తన వంతుగా నిరంతరం కొనసాగుతున్న చలమల్ల వెంకటలక్ష్మారెడ్డి దాతృత్వం వెలకట్టలేనిది అని అసిస్టెంట్ డైరెక్టర్ ప్రశంసించారు .

ఔషధపంపిణీ కార్యక్రమములో కోదాడ మండల పశువైద్యాధికారి డా. భూక్యా మధు, అనంతగిరి మండల పశువైద్యాధికారి డా . సిరిపురపు సురేంద్ర సిబ్బంది రాజు, చంద్రకళ , బాలచంద్ర పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News