పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబానికి సర్పంచ్.33 వేల సహాయం
పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబానికి సర్పంచ్.33 వేల సహాయం
స్థానికం బృందం
రామన్నపేట పట్టణంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో పనిచేస్తూ అనారోగ్యంతో మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికుడు గాదే నరసింహ కుటుంబానికి గ్రామపంచాయతీ నిధుల నుంచి రూ.33 వేల ఆర్థిక సాయం అందజేశారు.
శుక్రవారం సర్పంచ్ గరిక సత్యనారాయణ బాధిత కుటుంబ సభ్యులకు ఈ సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామపంచాయతీలో విధులు నిర్వర్తిస్తూ అనారోగ్యంతో మృతి చెందిన నరసింహ కుటుంబానికి గ్రామపంచాయతీ తరఫున అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మోటే రమేష్, మాజీ ఎంపీటీసీ సాల్వేరు అశోక్, వార్డు సభ్యులు, నాయకులు ఎండి అక్రమ్, జాడ సంతోష్, కొమ్ము శేఖర్, మోటే మహేష్, కొమ్ము రామస్వామి, అన్వర్, నకరకంటి సుదర్శన్, గొరిగే శేఖర్, బండ లింగస్వామి, రాపోలు ఉపేందర్, ఊట్కూరు శీను, గ్రామపంచాయతీ సిబ్బంది రాజ్ కుమార్, నకిరేకంటి రాము, గాదె యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి