Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 11:13 PM

పారిశ్రామిక రసాయన శాస్త్రం అనుభవం.. నాగార్జున కళాశాల విద్యార్థుల క్షేత్ర ప్రయాణం

పారిశ్రామిక రసాయన శాస్త్రం అనుభవం.. నాగార్జున కళాశాల విద్యార్థుల క్షేత్ర ప్రయాణం

పారిశ్రామిక రసాయన శాస్త్రం అనుభవం.. నాగార్జున కళాశాల విద్యార్థుల క్షేత్ర ప్రయాణం
February 04, 2026 04:35 PM 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

పారిశ్రామిక రసాయన శాస్త్రం అనుభవం.. నాగార్జున కళాశాల విద్యార్థుల క్షేత్ర ప్రయాణం

నాగార్జున ప్రభుత్వ కళాశాల (స్వ) రసాయన శాస్త్ర విభాగ ఆధ్వర్యంలో డిగ్రీ తృతీయ సంవత్సరం విద్యార్థులు ఆర్మాల బాలి ప్రాంతంలో నెలకొల్పబడిన నిధి పివిసి పైపుల తయారీ పరిశ్రమను బుధవారం సందర్శించారు. ఈ క్షేత్రపర్యటనలో భాగంగా విద్యార్థులు పైపుల తయారీలో ఉన్న వివిధ దశలను యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమ అధికారులు విద్యార్థుల సందేహలను నివృత్తి చేయడం జరిగింది. తరగతి గదుల్లో నేర్చుకున్న సిద్ధాంతపరమైన అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించే లక్ష్యంతో ఈ పర్యటనను ఏర్పాటు చేశామని రసాయనశాస్త్ర విభాగం అధ్యక్షులు డా. అంతటి శ్రీనివాస్ అన్నారు. పరిశ్రమలో పనిచేసే సాంకేతిక నిపుణులు పైపుల తయారీ ప్రక్రియను వివరించారు. విద్యార్థులు రెసిన్ (Resin) మరియు ఇతర రసాయనాలను ఏ నిష్పత్తిలో కలుపుతారో పరిశీలించారు. మిశ్రమం వేడి చేయబడి, మెషిన్ ద్వారా పైపు ఆకారాన్ని ఎలా పొందుతుందో ఉత్పాదక ప్రక్రియ చూశారు. తయారైన పైపుల దృఢత్వాన్ని, నాణ్యతను (Quality Control) పరీక్షించే విధానాలను నిపుణులు వివరించారు. వ్యర్థాల నిర్వహణ మరియు పర్యావరణానికి హాని కలగకుండా పరిశ్రమ తీసుకుంటున్న జాగ్రత్తల గురించి విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటన విద్యార్థులకు ఎంతో విజ్ఞానదాయకంగా ఉందని, పారిశ్రామిక రంగంపై అవగాహన పెంచుకోవడానికి ఇలాంటి సందర్శనలు దోహదపడతాయని ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ తెలిపారు. క్షేత్రపర్యటనలో

వైస్ ప్రిన్సిపాల్ డా॥పరంగి రవికుమార్, డా|| బి. వెంకటేశ్వర్లు విద్యార్థులు పాల్గొన్నారు .

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News