Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వివాహేతర సంబంధం.. భర్త హత్యకు కుట్ర కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 09:49 AM

పరీక్షలకు భయపడొద్దు.. ఆత్మవిశ్వాసంతో రాయండి: కలెక్టర్ అనురాగ్ జయంతి

పరీక్షలకు భయపడొద్దు.. ఆత్మవిశ్వాసంతో రాయండి: కలెక్టర్ అనురాగ్ జయంతి

పరీక్షలకు భయపడొద్దు.. ఆత్మవిశ్వాసంతో రాయండి: కలెక్టర్ అనురాగ్ జయంతి
March 06, 2026 06:22 PM 23 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బొమ్మలరామారం మండలం మల్యాల గ్రామంలోని కేజీబీవీ పాఠశాలను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో మొత్తం ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, అందులో పదవ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎంతమంది ఉన్నారో అడిగి తెలుసుకున్నారు.

పదవ తరగతి విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమైన కలెక్టర్ రాబోయే బోర్డు పరీక్షలపై పలు సూచనలు చేశారు. పరీక్షల సమయంలో భయపడకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. కొన్ని సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నూరుశాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు.

అనంతరం పాఠశాలలోని కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, లైబ్రరీలను క్షుణ్ణంగా పరిశీలించారు. ల్యాబ్‌లలో విద్యార్థులకు అందిస్తున్న శిక్షణపై వివరాలు తెలుసుకుని తగు సూచనలు చేశారు. అలాగే పాఠశాల డార్మిటరీ గదులను కూడా పరిశీలించారు.

మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించిన కలెక్టర్, మెనూ ప్రకారం విద్యార్థులకు రుచికరమైన మరియు నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. వంటకు అవసరమైన కూరగాయలు, గుడ్లు, కందిపప్పు, పండ్లు తదితర పదార్థాలు ఎప్పటికప్పుడు తాజాగా ఉండేలా చూడాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News