పరీక్షలకు భయపడొద్దు.. ఆత్మవిశ్వాసంతో రాయండి: కలెక్టర్ అనురాగ్ జయంతి
పరీక్షలకు భయపడొద్దు.. ఆత్మవిశ్వాసంతో రాయండి: కలెక్టర్ అనురాగ్ జయంతి
స్థానికం బృందం
బొమ్మలరామారం మండలం మల్యాల గ్రామంలోని కేజీబీవీ పాఠశాలను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో మొత్తం ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, అందులో పదవ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎంతమంది ఉన్నారో అడిగి తెలుసుకున్నారు.
పదవ తరగతి విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమైన కలెక్టర్ రాబోయే బోర్డు పరీక్షలపై పలు సూచనలు చేశారు. పరీక్షల సమయంలో భయపడకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. కొన్ని సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నూరుశాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు.
అనంతరం పాఠశాలలోని కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, లైబ్రరీలను క్షుణ్ణంగా పరిశీలించారు. ల్యాబ్లలో విద్యార్థులకు అందిస్తున్న శిక్షణపై వివరాలు తెలుసుకుని తగు సూచనలు చేశారు. అలాగే పాఠశాల డార్మిటరీ గదులను కూడా పరిశీలించారు.
మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించిన కలెక్టర్, మెనూ ప్రకారం విద్యార్థులకు రుచికరమైన మరియు నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. వంటకు అవసరమైన కూరగాయలు, గుడ్లు, కందిపప్పు, పండ్లు తదితర పదార్థాలు ఎప్పటికప్పుడు తాజాగా ఉండేలా చూడాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి