Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 05:10 AM

పర్యావరణానికి హాని లేకుండా ఔషధ పరిశోధనలు జరగాలి. అంతటి శ్రీనివాస్ గౌడ్

పర్యావరణానికి హాని లేకుండా ఔషధ పరిశోధనలు జరగాలి. అంతటి శ్రీనివాస్ గౌడ్

పర్యావరణానికి హాని లేకుండా ఔషధ పరిశోధనలు జరగాలి. అంతటి శ్రీనివాస్ గౌడ్
March 12, 2026 05:33 PM 17 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నాగార్జున ప్రభుత్వ కళాశాలలో జాతీయ సదస్సు ప్రారంభం

పర్యావరణాన్ని ఏమాత్రం కలుషితం చేయకుండా ఔషధ పరిశోధనలు జరగాలని నగరపు లింగయ్య అన్నారు.

గురువారం నాగార్జున గవర్నమెంట్ కాలేజీ రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో “భారతదేశంలో హరిత ఇంధన వనరుల ప్రాముఖ్యత – పర్యావరణ పరిరక్షణ” అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన Indian Institute of Chemical Technology ముఖ్య శాస్త్రవేత్త నాగారపు లింగయ్య మాట్లాడుతూ ఔషధాలను కనుగొనడం ఎంత ముఖ్యమో పర్యావరణాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని తెలిపారు.

ఈ సందర్భంగా University of Hyderabad రసాయన శాస్త్ర విభాగం ప్రొఫెసర్ Ramu Sridhar కీలక ప్రసంగం చేస్తూ కార్బోహైడ్రేట్ల ప్రాముఖ్యతను వివరించారు.

గౌరవ అతిథిగా పాల్గొన్న Indian Institute of Technology Hyderabad అసోసియేట్ ప్రొఫెసర్ Kishore Natte మాట్లాడుతూ ఫ్లోరిన్, బ్రోమిన్ రసాయన చర్యల ఉపయోగాలు, ఔషధాల తయారీలో వాటి ప్రాముఖ్యతను వివరించారు.

ఇంచార్జ్ ప్రిన్సిపాల్ పరంగి రవి కుమార్మా ట్లాడుతూ పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు హరిత ఇంధన వనరుల వినియోగం కీలకమని అన్నారు. ప్రపంచంలో పునరుత్పాదక ఇంధన రంగంలో భారతదేశం వేగంగా ముందుకు సాగుతున్న దేశాల్లో ఒకటిగా నిలుస్తోందని పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో పరీక్షల నియంత్రణాధికారి డా. డి. మునిస్వామి, విద్యా సమన్వయకర్త బత్తిని నాగరాజు, రసాయన శాస్త్ర విభాగ అధ్యాపకులు డా. అనిల్ అబ్రహం, డా. అనిల్ బొజ్జ, డా. బి. వెంకటేశ్వర్లు, డా. సి. జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News