పర్యావరణానికి హాని లేకుండా ఔషధ పరిశోధనలు జరగాలి. అంతటి శ్రీనివాస్ గౌడ్
పర్యావరణానికి హాని లేకుండా ఔషధ పరిశోధనలు జరగాలి. అంతటి శ్రీనివాస్ గౌడ్
స్థానికం బృందం
నాగార్జున ప్రభుత్వ కళాశాలలో జాతీయ సదస్సు ప్రారంభం
పర్యావరణాన్ని ఏమాత్రం కలుషితం చేయకుండా ఔషధ పరిశోధనలు జరగాలని నగరపు లింగయ్య అన్నారు.
గురువారం నాగార్జున గవర్నమెంట్ కాలేజీ రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో “భారతదేశంలో హరిత ఇంధన వనరుల ప్రాముఖ్యత – పర్యావరణ పరిరక్షణ” అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన Indian Institute of Chemical Technology ముఖ్య శాస్త్రవేత్త నాగారపు లింగయ్య మాట్లాడుతూ ఔషధాలను కనుగొనడం ఎంత ముఖ్యమో పర్యావరణాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని తెలిపారు.
ఈ సందర్భంగా University of Hyderabad రసాయన శాస్త్ర విభాగం ప్రొఫెసర్ Ramu Sridhar కీలక ప్రసంగం చేస్తూ కార్బోహైడ్రేట్ల ప్రాముఖ్యతను వివరించారు.
గౌరవ అతిథిగా పాల్గొన్న Indian Institute of Technology Hyderabad అసోసియేట్ ప్రొఫెసర్ Kishore Natte మాట్లాడుతూ ఫ్లోరిన్, బ్రోమిన్ రసాయన చర్యల ఉపయోగాలు, ఔషధాల తయారీలో వాటి ప్రాముఖ్యతను వివరించారు.
ఇంచార్జ్ ప్రిన్సిపాల్ పరంగి రవి కుమార్మా ట్లాడుతూ పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు హరిత ఇంధన వనరుల వినియోగం కీలకమని అన్నారు. ప్రపంచంలో పునరుత్పాదక ఇంధన రంగంలో భారతదేశం వేగంగా ముందుకు సాగుతున్న దేశాల్లో ఒకటిగా నిలుస్తోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పరీక్షల నియంత్రణాధికారి డా. డి. మునిస్వామి, విద్యా సమన్వయకర్త బత్తిని నాగరాజు, రసాయన శాస్త్ర విభాగ అధ్యాపకులు డా. అనిల్ అబ్రహం, డా. అనిల్ బొజ్జ, డా. బి. వెంకటేశ్వర్లు, డా. సి. జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి