పర్యావరణ పరిరక్షణకు విద్యార్థుల్లో చైతన్యం డిగ్రీ కళాశాలలో మట్టి విగ్రహాలు, విత్తన గోళాల తయారీ
పర్యావరణ పరిరక్షణకు విద్యార్థుల్లో చైతన్యం డిగ్రీ కళాశాలలో మట్టి విగ్రహాలు, విత్తన గోళాల తయారీ
స్థానికం బృందం
పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల రామన్నపేటలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కళాశాలలో నిర్వహించిన “ఏకో బజార్” కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో మట్టితో విగ్రహాలు, విత్తన గోళాలు (సీడ్ బాల్స్) తయారు చేయించారు.
ఈ సందర్భంగా కళాశాల ఉప ప్రిన్సిపాల్ Dr. P. వెంకటేశ్వర రావు మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో చెట్ల పెంపకం ఎంతో కీలకమని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో ప్రకృతి పరిరక్షణపై అవగాహన పెరుగుతుందని పేర్కొన్నారు.
అడవుల సంరక్షణ, చెట్ల పెంపకం అవసరాన్ని వివరించి ప్రతి విద్యార్థి కనీసం ఒక మొక్క నాటాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ నీలిమ, డాక్టర్ కిషన్, డాక్టర్ కృష్ణ కౌండిన్య, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ సునీత, అనిత, డాక్టర్ రవీందర్రావు, డాక్టర్ రాచమల్ల శ్రీను, టి. శ్రీనివాసులు, అమర్, నరేష్, ఆంజనేయులు, రాధిక, రవి తదితర అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి