Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 05:13 AM

ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు – ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి పుట్టల ఉదయ్ కుమార్

ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు – ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి పుట్టల ఉదయ్ కుమార్

ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు – ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి పుట్టల ఉదయ్ కుమార్
March 13, 2026 05:32 PM 18 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఒత్తిడికి లోనవ్వకుండా బోర్డు పరీక్షలు రాయాలి

విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనవ్వకుండా ఆత్మస్థైర్యంతో బోర్డు పరీక్షలు రాయాలని ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి పుట్టల ఉదయ్ కుమార్ సూచించారు.

ఎస్‌ఎఫ్‌ఐ రామన్నపేట మండల కమిటీ ఆధ్వర్యంలో గత ఆదివారం పదవ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. అందులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రామన్నపేట మండల కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ హై స్కూల్‌లో బహుమతి కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా పుట్టల ఉదయ్ కుమార్ మాట్లాడుతూ పరీక్షల సమయంలో విద్యార్థులు భయాందోళనలకు గురికాకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలని సూచించారు. సోషల్ మీడియాకు దూరంగా ఉండి మొబైల్ ఫోన్ల వినియోగాన్ని తగ్గించి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మంచి ఫలితాలు సాధించి తమకు, తమ తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే జిల్లాలో రామన్నపేట మండలం ప్రథమ స్థానంలో నిలిచేలా విద్యార్థులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

టాలెంట్ టెస్ట్‌లో మండల స్థాయిలో మొదటి బహుమతి కృష్ణవేణి టాలెంట్ హై స్కూల్‌కు చెందిన సుంచు ప్రణతి, ద్వితీయ బహుమతి వివేకానంద హై స్కూల్‌కు చెందిన కట్ట హరిణి సాధించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు బుంగ చంటి, ఎరుముల శంకర్, భుఖ్య సంతోష్, నవదీప్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News