Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 13, 2026 07:38 PM

ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు – ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి పుట్టల ఉదయ్ కుమార్

ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు – ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి పుట్టల ఉదయ్ కుమార్

ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు – ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి పుట్టల ఉదయ్ కుమార్
March 13, 2026 05:32 PM 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

ఒత్తిడికి లోనవ్వకుండా బోర్డు పరీక్షలు రాయాలి

విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనవ్వకుండా ఆత్మస్థైర్యంతో బోర్డు పరీక్షలు రాయాలని ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి పుట్టల ఉదయ్ కుమార్ సూచించారు.

ఎస్‌ఎఫ్‌ఐ రామన్నపేట మండల కమిటీ ఆధ్వర్యంలో గత ఆదివారం పదవ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. అందులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రామన్నపేట మండల కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ హై స్కూల్‌లో బహుమతి కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా పుట్టల ఉదయ్ కుమార్ మాట్లాడుతూ పరీక్షల సమయంలో విద్యార్థులు భయాందోళనలకు గురికాకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలని సూచించారు. సోషల్ మీడియాకు దూరంగా ఉండి మొబైల్ ఫోన్ల వినియోగాన్ని తగ్గించి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మంచి ఫలితాలు సాధించి తమకు, తమ తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే జిల్లాలో రామన్నపేట మండలం ప్రథమ స్థానంలో నిలిచేలా విద్యార్థులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

టాలెంట్ టెస్ట్‌లో మండల స్థాయిలో మొదటి బహుమతి కృష్ణవేణి టాలెంట్ హై స్కూల్‌కు చెందిన సుంచు ప్రణతి, ద్వితీయ బహుమతి వివేకానంద హై స్కూల్‌కు చెందిన కట్ట హరిణి సాధించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు బుంగ చంటి, ఎరుముల శంకర్, భుఖ్య సంతోష్, నవదీప్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News