Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సదాశివపేట సిఎస్ఐ చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలు:పాస్టర్ గిరి ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు.... “500 గర్భిణులను బైక్‌లో రక్షించిన ప్రాణదాత: ఛత్తీస్‌గఢ్ ‘బైక్ హీరో’ సురేష్ బెల్సారే” “మండల మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో ఆర్టీసీకి అద్దె బస్సులు… మహిళల ఆర్థిక సాధికారతకు కొత్త దిశ : సి‌ఎం రేవంత్” చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 03, 2026 06:43 PM

ప్రతి పిల్లవాడూ ప్రభుత్వ పాఠశాలలోనే చేరాలి: సర్పంచ్ రాధా శ్రీనివాస్

ప్రతి పిల్లవాడూ ప్రభుత్వ పాఠశాలలోనే చేరాలి: సర్పంచ్ రాధా శ్రీనివాస్

ప్రతి పిల్లవాడూ ప్రభుత్వ పాఠశాలలోనే చేరాలి: సర్పంచ్ రాధా శ్రీనివాస్
April 03, 2026 05:01 PM 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని వెల్లంకి ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం గుడ్ ఫ్రైడే సెలవు రోజున కూడా నిర్వహించారు.

కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన, ఉచిత విద్య అందుబాటులో ఉందని, ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని పిలుపునిచ్చారు.

అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులు గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రవేశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని, పలువురు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కరపత్ర దాత బత్తుల శ్రీనివాస్, AAPC చైర్‌పర్సన్ పులగం సులోచన, ప్రధానోపాధ్యాయులు పల్లె మోహన్ రెడ్డి, ఉపాధ్యాయులు ఇట్టే సోమిరెడ్డి, ఉయ్యాల బిక్షమయ్య, దూదిగామ సువర్ణ, మందుగుల వెంకటయ్య, కొసన మాధవి, నకిరేకంటి అశ్విని తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News