ప్రతి పిల్లవాడూ ప్రభుత్వ పాఠశాలలోనే చేరాలి: సర్పంచ్ రాధా శ్రీనివాస్
ప్రతి పిల్లవాడూ ప్రభుత్వ పాఠశాలలోనే చేరాలి: సర్పంచ్ రాధా శ్రీనివాస్
Editor Desk
రామన్నపేట మండలంలోని వెల్లంకి ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం గుడ్ ఫ్రైడే సెలవు రోజున కూడా నిర్వహించారు.
కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన, ఉచిత విద్య అందుబాటులో ఉందని, ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని పిలుపునిచ్చారు.
అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులు గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రవేశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని, పలువురు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కరపత్ర దాత బత్తుల శ్రీనివాస్, AAPC చైర్పర్సన్ పులగం సులోచన, ప్రధానోపాధ్యాయులు పల్లె మోహన్ రెడ్డి, ఉపాధ్యాయులు ఇట్టే సోమిరెడ్డి, ఉయ్యాల బిక్షమయ్య, దూదిగామ సువర్ణ, మందుగుల వెంకటయ్య, కొసన మాధవి, నకిరేకంటి అశ్విని తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి