Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
'ఐరా' గ్లోబల్ స్కూల్ విద్యార్థుల ఘనత లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:10 PM

ప్రతి పిల్లవాడూ ప్రభుత్వ పాఠశాలలోనే చేరాలి: సర్పంచ్ రాధా శ్రీనివాస్

ప్రతి పిల్లవాడూ ప్రభుత్వ పాఠశాలలోనే చేరాలి: సర్పంచ్ రాధా శ్రీనివాస్

ప్రతి పిల్లవాడూ ప్రభుత్వ పాఠశాలలోనే చేరాలి: సర్పంచ్ రాధా శ్రీనివాస్
April 03, 2026 05:01 PM 79 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని వెల్లంకి ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం గుడ్ ఫ్రైడే సెలవు రోజున కూడా నిర్వహించారు.

కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన, ఉచిత విద్య అందుబాటులో ఉందని, ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని పిలుపునిచ్చారు.

అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థులు గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రవేశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని, పలువురు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కరపత్ర దాత బత్తుల శ్రీనివాస్, AAPC చైర్‌పర్సన్ పులగం సులోచన, ప్రధానోపాధ్యాయులు పల్లె మోహన్ రెడ్డి, ఉపాధ్యాయులు ఇట్టే సోమిరెడ్డి, ఉయ్యాల బిక్షమయ్య, దూదిగామ సువర్ణ, మందుగుల వెంకటయ్య, కొసన మాధవి, నకిరేకంటి అశ్విని తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News