ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణను బాధ్యతగా భావించి మొక్కలను నాటాలి
ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణను బాధ్యతగా భావించి మొక్కలను నాటాలి
Harish K
పర్యావరణ పరిరక్షణలో భాగంగా కోదాడ పట్టణంలోని కేటీఎస్ ఉన్నత పాఠశాల ఆవరణలో వనమహోత్సవ కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. కోదాడ ట్రాఫిక్ ఎస్సై ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, పాఠశాల యాజమాన్యం మరియు విద్యార్థులు కలిసి ఒకే రోజు 300 మొక్కలను నాటారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్సై మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పర్యావరణ బాధ్యతగా మొక్కలను నాటడమే కాకుండా, వాటిని సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, పచ్చని వాతావరణాన్ని అందించడానికి విద్యార్థి దశ నుంచే పచ్చదనంపై అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. పాఠశాల ఆవరణలో నాటిన ప్రతి మొక్కను జాగ్రత్తగా కాపాడుకుంటామని ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో కోదాడ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, కేటీఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి