Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హయత్‌నగర్ డిగ్రీ కాలేజీలో వాలీబాల్ శిక్షణ శిబిరం ప్రారంభం భూ వివాదాలకు చెక్… భూభారతి పోర్టల్‌కు శ్రీకారం “టికెట్ ఉంటే సీటు తప్పనిసరి… ఇది ప్రతి పౌరుని హక్కు!” చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 01, 2026 07:54 PM

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.
April 01, 2026 04:43 PM 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలి:

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు.

బుధవారం ఆలేరు మండలం శారజీపేట గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వార్డులు, పరిసరాలను పరిశీలించి పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందిని ఆదేశించారు. శానిటేషన్ పనులు ప్రతిరోజూ క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు.

ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు, హాజరు పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రతి సిబ్బంది విధులకు హాజరు నమోదు సక్రమంగా చేస్తున్నారా అనే విషయాన్ని డైలీ అటెండెన్స్ ద్వారా పరిశీలించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించరాదని హెచ్చరించారు.

ప్రతిరోజూ ఓపీకి వచ్చే రోగుల సంఖ్య, వారి వివరాల నమోదు విధానాన్ని తెలుసుకుని రిజిస్టర్‌ను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ప్రతి రోగి వివరాలు స్పష్టంగా నమోదు చేయాలని ఆదేశించారు.

ఆసుపత్రిలో అవసరమైన ఔషధాల లభ్యతపై ఆరా తీశారు. మందులు సరిపడా అందుబాటులో ఉంచాలని, రోగులకు అందిస్తున్న ఔషధాల వివరాలను క్రమబద్ధంగా నమోదు చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారి మనోహర్, వైద్య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News