ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.
Editor Desk
ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలి:
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు.
బుధవారం ఆలేరు మండలం శారజీపేట గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వార్డులు, పరిసరాలను పరిశీలించి పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందిని ఆదేశించారు. శానిటేషన్ పనులు ప్రతిరోజూ క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు.
ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు, హాజరు పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రతి సిబ్బంది విధులకు హాజరు నమోదు సక్రమంగా చేస్తున్నారా అనే విషయాన్ని డైలీ అటెండెన్స్ ద్వారా పరిశీలించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించరాదని హెచ్చరించారు.
ప్రతిరోజూ ఓపీకి వచ్చే రోగుల సంఖ్య, వారి వివరాల నమోదు విధానాన్ని తెలుసుకుని రిజిస్టర్ను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ప్రతి రోగి వివరాలు స్పష్టంగా నమోదు చేయాలని ఆదేశించారు.
ఆసుపత్రిలో అవసరమైన ఔషధాల లభ్యతపై ఆరా తీశారు. మందులు సరిపడా అందుబాటులో ఉంచాలని, రోగులకు అందిస్తున్న ఔషధాల వివరాలను క్రమబద్ధంగా నమోదు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య అధికారి మనోహర్, వైద్య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి